Tuesday 22 October 2013

అమెరికా జాతీయునికి కండీషనల్ బెయిల్...!

భువనేశ్వర్ విమానాశ్రయం లో గత నెల 17 న హూస్టన్ కి చెందిన విలియం మైఖేల్ హుర్ట్ బైస్ అనే అమెరికా జాతీయుడిని అక్రమంగా 0.22 బుల్లెట్ లు కలిగిఉన్నందుకు అరెస్ట్ చేశారు.కాగా నిన్న సోమవారం అతడికి అక్కడి సెషన్స్ కోర్ట్ కండిషన్స్ తో కూడిన బెయిల్ మంజూరు చేసింది.అతడు ఒడిషా దాటి వెళ్ళకూడదని అలాగే వీసా,పాస్ పోర్ట్ లను సంబంధిత అధికారుల దగ్గర భద్రపరచాలని కోర్ట్ ఆదేశించింది.

50,000 రూపాయల పూచికత్తుతో కండీషనల్ బెయిల్ పై నిన్న జైలు నుండి బయటికి వస్తూ విలేఖరులతో మాట్లాడటానికి నిరాకరించాడు.పరదీప్ లోని ఒక షిప్ ఇంజన్ పరిశీలించి బాగుచేయడానికి కాంట్రాక్ట్ పై  వచ్చిన అతను మొదట భువనేశ్వర్ లో జయదేవ్ హోటల్ లో దిగాడు.అతడి పని ముగించుకొని వెళుతుండగా భువనేశ్వర్ విమానాశ్రయం లో అదుపులోకి తీసుకోవడం జరిగింది.Click here


No comments:

Post a Comment