గత ఆరునెలల కాలం లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి భాగోతాలని పరిశీలించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఈరోజు గవర్నర్ కి ఓ లేఖ రాసినట్టు తెలిసింది.దాదాపు 5 నుంచి పదివేల కోట్ల ధనాన్ని కేవలం తన పదవిని అడ్డుపెట్టుకొని ఎడాపెడా సంతకాలు చేసి బదిలీల ద్వారా సంపాదించారని ఆరోపించారు.IAS,IPS అధికారుల ని కూడా వదలకుండా అందినకాడికి దోచుకున్నారని,ఈ వ్యవహారం కిరణ్ సోదరుని కనుసన్నలలో జరిగిందని తెలిపారు.ఒకప్పుడు కిరణ్ కి సన్నిహితంగా మెలిగిన డొక్కా ఆరోపణలు చేయడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.Click here
No comments:
Post a Comment