గత నెల మార్చ్ లోను,ఈ నెల లోను మొత్తం మీద ముగ్గురు స్వలింగ సంపర్కులు పాకిస్తాన్ లోని లాహోర్ లో హత్య కి గురయ్యారు.ఇవి చాలా సంచలనం సృష్టించాయి.ఆ ముగ్గురి లో ఒకరు నడికారు వయసు లోఉన్న ఓ ఆర్మీ అధికారి,మరో ఇద్దరు 20 ఏళ్ళ లోపు వారు.ఆ ముగ్గురుని హత్య చేసింది తానేనని ,స్వలింగ సంపర్కులు సమాజాన్ని చెడు మార్గం పట్టిస్తున్నారని అంతే గాక ప్రమాదకరమైన వ్యాధుల్ని సైతం ప్రబలేలా చేస్తున్నారని నిన్న పట్టుబడి జైలులో ఉన్న ముహమ్మద్ ఇజాజ్ చెప్పాడు.అతను 2011 లో వివాహం చేసుకున్నాడు.ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారతనికి.
పాకిస్తాన్ లోని గే కమ్మ్యూనిటీ లో ఈ సంఘటన సంచలనం రేపింది.ఈ రోజు ఇజాజ్ ని కోర్ట్ లో ప్రవేశపెట్టవలసివుంది. Click here
No comments:
Post a Comment