Friday 4 April 2014

మహిళా జర్నలిస్ట్ లపై దాడి,ఒకరి మృతి..!

                                             Anja                                    Kathy


అఫ్ఘనిస్తాన్ లోని ఖోస్త్ ప్రావిన్స్ కి చెందిన ఒక ప్రదేశంలో అధ్యక్ష ఎన్నికలని పరిశీలించడానికి వచ్చిన అసోసియేటెడ్ ప్రెస్ కి చెందిన ఫోటో జర్నలిస్ట్ అంజా నైడ్రింగస్ (జర్మనీ),రిపోర్టర్ కేథీ గేనన్ (కెనడా) లని లక్ష్యంగా చేసుకొని ఒక పోలిస్ అధికారి కాల్పులు జరపగా అంజా అక్కడిక్కడే మృతిచెందారు. కేథీ ఆసుపత్రిలో గాయాలతో కొట్టుమిట్టాడుతున్నది.అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ పూర్తి స్థాయి దర్యాప్తు కి ఆదేశించారు.గత నెలలో కూడా ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక విలేఖరిని,స్వీడన్ దేశానికి చెందిన విలేఖరిని కాల్చి చంపారు.కాగా తాజా దాడితో తమ కి సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. పూర్తి సెక్యూరిటీ తో ఎలక్షన్ వ్యవహారాల్ని పరిశీలించడానికి వచ్చి,కారులో కూర్చుని ఉన్న వారిని నఖీబుల్లా అనే ఒక పోలీస్ అధికారి చూసి "అల్లాహో అక్బర్ " అని అరుస్తూ ఆ ఇరువురు పై కాల్పులు జరిపాడు.ఆ తరువాత అతను  స్వయంగా ఇతర రక్షణ అధికారులకి లొంగిపోయాడు.Click here

No comments:

Post a Comment