Wednesday 23 April 2014

పూరీ క్షేత్రం లో దర్శనానికి అనుమతించలేదని పోలీసులపై దాడి చేసిన BSF జవాన్లు



జగన్నాధుని నిలయమైన పూరి క్షేత్రం లో పండా(పూజారులు) లకి,భక్తుల మధ్య జరిగే గొడవలు మనం అప్పుడప్పుడు చదువుతూనే ఉంటాం.మన దక్షిణాది బ్రాహ్మణులంత సౌమ్యంగా ఎందుకనో ఉత్తరాది వారు ఉండరు.ఇప్పుడు తాజాగా ఇంకొక ఉదంతం పూరీ లో గత శుక్రవారం జరిగింది.ఓ 20 మంది BSF జవాన్లు ఆలయం లోని గర్భగుడి లోకి దర్శనం కోసం ప్రవేశించగా అక్కడ ఉన్న ఒరిస్సా పోలీసులు సమయం అయిపోయిందని వెళ్ళకుండా అడ్డుకున్నారు.దాంతో ఆ జవాన్లకి,ఈ పోలీసులకి మాట మాట పెరిగి కొట్టుకున్నారు.కొంత మంది పోలీసులకి బాగానే దెబ్బలు తగిలాయి.ఆలయ అధికారుల కంప్లైంట్ మేరకు 6 గురు జవాన్లను టౌన్ పోలీస్ వారు అదుపులోకి తీసుకున్నారు. Click here 

No comments:

Post a Comment