ఈ రోజు ఉదయం 7.15 కి చెన్నై రైల్వెయ్ స్టేషన్ లోజరిగిన బాంబు పేలుడు లో బెంగుళూరు లోని TCS కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచెస్తున్న గుంటూరు అమ్మాయి స్వాతి (22) మరణించడం,ఇంకా 13 మంది గాయపడడం తెలిసినదే.బెంగుళూరు నుంచి గౌహతి దాకా వెళుతున్న ఈ రైలు నిజానికి ఈ రోజు ఆలశ్యంగా నడుస్తున్నదని తెలిసింది.ఆ సమయానికి ఆంధ్ర ప్రదేశ్ లో ఉండవలసిందని అంటున్నారు.
బెంగళూరు లోని CCTV ఫుటేజ్ లని కూడా పరిశీలిస్తామని ,అలాగే రైలు లోనుంచి ఒక అనుమానితుణ్ణి అదుపు లోకి తీసుకున్నట్లు చెన్నయ్ పోలీసులు తెలియజేశారు.పూర్తి వివరాలు CB-CID విచారణ జరిగిన తరువాత తెలుస్తాయని అన్నారు.Click here
No comments:
Post a Comment