Saturday 10 May 2014

లేడీ డాక్టర్ ని చంపిన వార్డ్ బోయ్..!



ఈశాన్య రాష్ట్రమైన అస్సాం లో ఈ ఘోరకృత్యం నిన్న శుక్రవారం చోటుచేసుకుంది.దిబ్రుఘడ్ లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో పోస్ట్ గ్రాడ్యుఏషన్ చేస్తున్న సరితా తోష్ణివాల్ (24)  రక్తపు మడుగులో ఆసుపత్రి లోని ఒక బెడ్ లో పడిఉండగా నిన్న ఉదయం కనుగొన్నారు.ఆమె అప్పటికే మరణించింది.ఆమె కి అదే కాలేజ్ లో పి.జి.చేస్తున్న రోషన్ అగ్రవాల్ తో వచ్చే జులై మాసం లో వివాహం జరగనున్నది.

దిబ్రుఘడ్ ఎస్.పి. రాణా భూయాన్ వివరాల ప్రకారం అదే హాస్పిటల్ పనిచేస్తున్న వార్డ్ బోయ్ తిరు మేచ్ ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.సర్జికల్ నైఫ్ తో పీక పై గాయం చేయడం తో మరణించినట్లు తెలిసింది.సిసిటివి ఫుటేజ్ లు కూడా పోలీసులు వశపరుచుకున్నారు.జూనియర్ డాక్టర్ లంతా విధులను బహిష్కరించి ఆందోళనలో ఫాల్గొన్నారు.

ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్  సాధ్యమైనంత త్వరగా ఈ కేసుని పరిశోధించి పూర్తి వివరాలని అందజేయవలసిందిగా పోలీస్ వర్గాలను ఆదేశించారు.Click here

No comments:

Post a Comment