Tuesday 27 May 2014

ప్రముఖ ఒడియా డిటెక్టివ్ రచయిత కందూరి చరణ్ దాస్ మృతి....!



నిన్న సోమవారం ప్రముఖ ఒడియా డిటెక్టివ్ రచయిత కందూరి చరణ్ దాస్ కలకత్తా లో మృతి చెందారు.ఆయన వయసు 85 సంవత్సరాలు.తన పన్నెండవ ఏటనే ఒరిస్సా రాష్ట్రాన్ని వదిలి కలకత్తా చేరుకున్నారు.చిన్న చిన్న పనులు చేస్తూనే ఓ వైపు రచనా వ్యాసాంగాన్ని మొదలుపెట్టారు.60 వ దశకం నుండి 80 వ దశకం దాకా ఆయన సస్పెన్స్ నవలలు ఒడియా భాషలో రాజ్యమేలాయి.దాదాపు 50 నవలలు రాశారు.భిభూతి పట్నాయక్  తో కలిసి రంగనతి అనే నవల రాశారు.రాజశ్రీ పాకెట్ బుక్స్ అనే సంస్థ ఆయన నవలల్ని ముద్రించింది. దాస్ భార్య కల్పనా కుమారి కూడా రచయిత్రి యే.ఆమె కి కేంద్రసాహిత్య అకాడెమి అవార్డ్ వరించింది.Click here

No comments:

Post a Comment