Thursday 29 May 2014

I.P.S. అధికారి పై కేసు నమోదు చేసిన బెంగుళూరు పోలీసులు,ఉద్రిక్తత.




నిన్న బుధవారం కర్ణాటక స్టేట్  రిజర్వ్ పోలీస్ కి చెందిన రవీంద్రనాధ్ పై బెంగుళురు పోలీసులు F.I.R. ని నమోదు చేశారు.ఆయన A.D.G.P. స్థాయిలో లో వున్న I.P.S. అధికారి.ఓ కాఫీషాప్ లో ఉన్నప్పుడు తనను రవీంద్రనాధ్ ఫోటో తీశారని ఒక మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు బెంగుళూరు సెంట్రల్ డి.సి.పి.రవికాంతె గౌడ మీడియా కి తెలిపారు.ఇదిలా ఉండగా తమ అధికారి పై ఎఫ్.ఐ.ఆర్.ని నమోదు చేయడం నిరసించిన వందలాదిమంది రిజర్వ్ పోలీసులు నిన్న రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేశారు.వాహనాల్ని నిలిపివేసి..ఒక బస్ లో గాలి తీసివేశారు.

కాగా రవీంద్రనాధ్ ని బదిలీ చేసినట్లుగా తెలిసింది.తాను ఆ మహిళని ఫోటో తీయలేదని తన మొబైల్ ని వేరే వ్యక్తి తీసుకున్నట్లుగా తెలిపారు. Click here          

No comments:

Post a Comment