ఈ రోజు పాకిస్తాన్ లోని గుజ్రన్వాల లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం లో జరిగిన ఓ ర్యాలీ లో అతని కాన్వాయ్ పై కాల్పులు జరపడం తో ఉద్రిక్తత నెలకొంది.15 నెలల క్రితం పాక్ లో ప్రజాస్వామ్య యుతం గా నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏర్పడింది.మతపెద్ద తాహిర్ ఉల్ ఖాద్రి ఇంకా ఇమ్రాన్ ఖాన్ వంటి ప్రభుత్వ వ్యతిరేక పార్టి ల నుంచి ఆందోళనకారులు ప్రభుత్వం గద్దె దిగాలనే డిమాండ్ తో ఈ రోజు దిగ్బంధనానికి పిలుపునిచ్చారు.ఊరేగింపుదారులు డ్రమ్ములు మోగించుకుంటూ ,పెద్ద ఎత్తున గుమిగూడి ఆందోళనకి ఉద్యమించడం తో గందరగోళం చెలరేగింది.ఈ దశలో కొంతమంది కాల్పులు జరపడం తో ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్ కి బులెట్లు తగిలాయి.అయితే అతనికి హాని ఏమీ జరగలేదు.
కొంతమంది కధనం ప్రకారం ఇమ్రాన్ వెనుక ఆర్మీ సహకారం ఉండిఉండవచ్చునని అంటున్నారు.గత కొద్దికాలంగా తాలిబన్ల మీద కఠినవైఖరి అవలంబించడం కొన్ని ఆర్మీ వర్గాలకు కంటగింపుగా ఉన్నది.ప్రభుత్వ పోస్టర్లను ,వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేసినట్టు భోగట్టా. Click here
No comments:
Post a Comment