Friday 7 November 2014

నిఘా నేత్రాలకి అందకుండా పోయిన దావుద్ ఇబ్రహిం,చోటా రాజన్ లు ఎక్కడున్నట్లు..?



దావుద్ ఇబ్రహీం 1993 ముంబాయి పేలుళ్ళ తర్వాత కనిపించకుండాపోయిన విషయం తెలిసినదే.పాకిస్తాన్ లోని కరాచి నగరం లో టోనీ క్లిఫ్టన్ రోడ్ లో అతనికి ,అతను సోదరుడు అనీస్ ఇబ్రహీం కి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ISI చక్కటి బంగళాల్లో ఆశ్రయం కల్పించిన విష్యం తెలిసిందే.అయితే ఉన్నట్టుండి నిఘా సంస్థల రాడార్ లకి కూడా దొరకకుండా దావుద్ మసలుతున్నట్టు తెలుస్తున్నది.గత నెల రోజులుగా అతని ఆచూకి నిఘా సంస్థలకి కూడా దొరకడం లేదు.గతం లో దావుద్ హాజ్ యాత్ర చేసినా ,దుబాయ్ వెళ్ళినా అతని జాడల్ని కనిపెట్టేవి నిఘా సంస్థలు.ఈసారి మాత్రం అతని అదృశ్యం వెనుక కారణాలు ఏమిటో ఎవరికి అంతు పట్టడం లేదు.

ఇదిలా ఉండగా ఇంకొక అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ఆచూకి కూడా నిఘా సంస్థలకి దొరకడం లేదట నెల రోజులనుంచి.బ్యాంకాక్ నుంచి సింగ పూర్ కి చక్కర్లు కొడుతుండే అతను జాడ కూడా తెలియకుండా పోయింది.చోటా రాజన్ దావుద్ కి ఒకప్పుడు అనుచరునిగా  ఉండి ఆ తర్వాత విడిపోయాడు.Click here 

No comments:

Post a Comment