Tuesday 13 January 2015

మోహినీ ఆట్టం శాస్త్రీయ నృత్యం లో Ph.D. తీసుకున్న మొదటి ముస్లిం వ్యక్తి ..!



KM అబూ కేరళ కి చెందిన యువకుడు. ఆ రాష్ట్రం లోని శాస్త్రీయ నృత్యమైన మోహినీ ఆట్టం లో ఇటీవల పి.హెచ్.డి.పొందాడు.ఈ విధంగా ఒక ముస్లిం మతానికి చెందిన వ్యక్తి డాక్టరేట్ తీసుకోవడం ఇదే మొదటిసారి.కేరళ కి చెందిన Deemed university కేరళ కళామండలం దీన్ని ప్రదానం చేసింది.చిన్న నాటి నుంచే భరత నాట్యం నేర్చుకున్నానని ..ఆ తర్వాత మోహినీ ఆట్టం లో కి వచ్చానని అతను తెలిపాడు.మొదట కొంతమంది అదోలా భావించినా తర్వాత ఏమీ ఇబ్బంది ఎదురుకాలేదని అన్నాడాయన.మూడు దశాబ్దాల తన కృషి ఫలితమే తన డాక్టరేట్ డిగ్రీ అని సంతృప్తి వెలిబుచ్చాడు అబూ..!Click here  

No comments:

Post a Comment