Thursday 14 May 2015

ఎవరికి పట్టని శరణార్ధులు వాళ్ళు.



ప్రపంచం లోనే ఎవరికి పట్టని ఎవరు దరి చేర్చుకోవడానికి ఇష్టపడని మైనారిటీలు బహుశా వీళ్ళేనని చరిత్రకారుల ఉవాచ.వీళ్ళే రోహింగ్యాలు అన బడే జాతికి చెందిన వారు.మైన్మార్ లో కి పెద్ద సంఖ్యలో వలస వచ్చిన వీరిని అక్కడి ప్రభుత్వం కూడా బయటకి నెట్టివేస్తున్నది.2009 లో బౌద్ధులకు,వీరికి  ఘర్షణ జరగడం తో రెండు వందల మంది వరకు చనిపోవడం తో అక్కడి ప్రభుత్వం వీరి పై ఉక్కుపాదం పెట్టింది.ఆంగ్ సాన్ సుకీ లాంటి వారు కూడ వీళ్ళ తరపున మాట్లాడే సాహసం చేయడం లేదు.బంగ్లాదేశ్ కి ,ఇండోనేషియా కి,ఇంకా చుట్టు పక్క దేశాలకి వెళ్ళాలన్నా అవకాశం లేక ఆ సంద్రం పరిసరాల్లోనే పడవల మీద తిరుగుతూ ఎక్కడ వీలుంటే అక్కడ గడుపుతుంటారు.Click here

No comments:

Post a Comment