Friday 15 May 2015

డ్రెస్ కోడ్ పాటించలేదని జిల్లా కలెక్టర్ల కి తాఖీదులు



ఈ నెల 9 వ తేదీన చత్తిస్ ఘడ్ రాష్ట్రం లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంఖుస్థాపన చేసిన విషయం విదితమే.ఆ పర్యటన లో భాగంగా బస్తర్ జిల్లా కలెక్టర్ అమిత్ కటారియా (2004 బ్యాచ్) ,దంతెవాడ జిల్లా కలెక్టర్ కెసి దేవసేనాపతి (2007 బ్యాచ్) ప్రధాని ని కలిసి రిసీవ్ చేసుకునే సమయం లో డిగ్నిఫైడ్ గా డ్రెస్ వేసుకోలేదని ,సన్ గ్లాసెస్ పెట్టుకుని కూడా ఉన్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి తాఖీదులు పంపి మరోసారి ఈ  విధంగా చేయవద్దని కోరింది. అది ఆల్  ఇండియా సర్విసెస్ (కండక్ట్)రూల్స్ కి విరుద్ధమని తెలిపింది.Click here  

No comments:

Post a Comment