Thursday 24 December 2015

ముస్లిం సంప్రదాయ పద్దతుల్లో ఫ్లైట్ లు నడపబోతున్న హిందూ దంపతులు.



మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి షరియత్ పద్దతుల్ని అనుసరించి నడిచే విమాన సర్వీస్ ల్ని రవి గజెంద్రన్,కార్థియని గోవిందన్ అనే  హిందూ దంపతులు ప్రారంభిస్తున్నారు. దీని పేరు రాయని ఎయిర్ .ఈ ఫ్లైట్ లలో  పోర్క్ గాని మద్యం గాని సరఫరా చేయరు.సిబ్బంది అంతా ఇస్లాం కి అనుగుణమైన డ్రెస్ లో నే ఉంటారు.నమాజ్ చేసుకోవడానికి కూడా అనువు గా ఉంటాయి.పైలెట్ లు,క్రూ ఇంకా ఇతర సిబ్బంది అంతా కలిపి 350 దాకా ఉంటారు.ప్రస్తుతానికి ఈ సర్వీసులు కౌలాలం పూర్ నుంచి లాంగ్క్వి మధ్య లో నడుస్తున్నాయి.భవిష్యత్ లో ఇండోనేషియా ,ఫిలిప్పైన్స్ వంటి ఇతర దేశాలకి సైతం విస్తరిస్తామని నిర్వాహకులు అంటున్నారు.మలేషియా లో 60 శాతం దాకా ముస్లిం లు ఉండగా 6.3 శాతం దాకా హిందువులు ఉన్నారు.Click here

1 comment: