Friday 15 April 2016

కొత్త రకం పుచ్చకాయల తో ముందుకు వస్తున్న ముగ్గురు యువకులు

యాపిల్ మెలోన్

తూర్పు గోదావరి జిల్లా లోని గొల్లప్రోలు కి చెందిన వీరబాబు,విశాఖ పట్నం కి చెందిన ప్రసాద్,విజయనగరం కి చెందిన ప్రసన్నకుమార్  వీళ్ళ ముగ్గురు కి విన్నూత్నమైన  ఆలోచన వచ్చింది.వచ్చిందే తడవుగా మిత్రులు ముగ్గురు ఉద్యోగాల్ని వదిలి పెట్టి కార్య రంగం లోకి దూకారు.యాపిల్ మెలోన్ ,ఎల్లో కింగ్,ఎల్లో క్వీన్ అనే పుచ్చ కాయల్లోని వెరైటీల్ని పండిస్తున్నారు.వీటి విత్తనాల్ని  తైవాన్  నుంచి తెప్పించుకున్నారు.చిన్న జగ్గం పేట దగ్గర 19 ఎకరాల భూమిని లీజ్ కి తీసుకొని సేద్యం మొదలెట్టారు.అవి మాత్రమే కాకుండా పైనేపిల్,అరటి,టమాట,బొప్పాస ఇలా రకరకాల పంటల్ని వేశారు.మధ్యవర్తులు ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా సూపర్ మార్కెట్ లకి,మాల్స్ కి సరఫరా చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.భవిష్యత్ లో ఇతర ప్రాంతాల్లో కి సైతం విస్తరించాలని ఉందని మీడియా కి తెలిపారు.

No comments:

Post a Comment