Monday 6 June 2016

మేధా పాట్కర్ కి చుక్కెదురు..



నిన్న ఆదివారం ఒరిస్సాలోని వేదాంత అల్యూమినియం ప్రాజెక్ట్ కి వ్యతిరేకం గా మేధా పాట్కర్ ఆధ్వర్యం లో లాంజిగడ్ వరకు తలపెట్టిన ర్యాలిని కలహండి జిల్లా లోని స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు.ప్రాజెక్ట్ కి ఇప్పటికే స్థానికులు భూమి ని ఇచ్చిఉన్నారని,కంపెనీ కూడా స్థానిక ప్రజల కోసం ఆసుపత్రులు,పాఠశాలలు వంటివి నెలకొల్పిందని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారని ,ఈ విషయం లో బయటి వ్యక్తులు వచ్చి  తమ అభివృద్దిని అడ్డుకోవద్దని నిరసన తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఈ కార్యక్రమం తలపెట్టడం కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికేనని నియమగిరి సురక్షా సమితి నాయకులు తెలిపారు. 

No comments:

Post a Comment