Thursday 14 July 2016

స్మృతి ఇరాని చేసిన నియామకాన్ని ఆపిన ప్రధాని కార్యాలయం



స్మృతి ఇరాని మానవ వనరుల శాఖా మంత్రి గా ఉన్నప్పుడు చేసిన నియామకాన్ని ప్రస్తుతం ప్రధాని మంత్రి కార్యాలయం అనుమతించనట్లుగా వార్తలు తెలుపుతున్నాయి.డా.సర్వేంద్ర విక్రం బహదూర్ సింగ్ ని C.B.S.E. (సెకండరీ విద్య) చీఫ్ గా ఆమె నియామకం చేయడానికి పచ్చ జెండా ఊపగా ,మళ్ళీ తదుపరి ఉత్తర్వులు ప్రధాని ఆధీనం లో ఉన్న అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఇస్తుందని అంత వరకు ఆ పోస్ట్ ఖాళీ గా ఉంటుందని తాజా గా లేఖ HRD మంత్రిత్వ శాఖ కి అందింది.2014 నుంచి ఈ పోస్ట్ లో రెగ్యులర్ అధికారి గా ఎవరూ లేరు.కనీసం మూడేళ్ళు విద్యా శాఖ పరిపాలన లో అనుభవం ఉన్న వారికి మాత్రమే ఈ నియామకం లో ప్రాముఖ్యతనిస్తారు.ఆ విధంగా చూస్తే మరో ఇద్దరు అధికారులు సింగ్ కంటే ముందు ఉన్నట్లు భోగట్టా.

No comments:

Post a Comment