Sunday 17 July 2016

తన గోడ పక్కన మూత్రం పోశాడని కాల్పులు జరిపిన డాక్టర్.



నిన్న శనివారం ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో చిన్న కారణానికి తుపాకి తీసి కాల్పులు జరిపాడు ఒక హోమియోపతి డాక్టర్ . ఇంతకీ కారణం ఏమిటంటే ఆయన క్లినిక్ కి దగ్గర లోని ఒక చెత్త కుప్ప మీద మహేశ్వర్  రౌత్రాయ్ అనే ఉద్యోగి మూత్రం పోశాడట. ఎందుకు అక్కడ మూత్రం పోశావు అని డాక్టర్ ప్రధాన్ గద్దించి అడగ్గా ,అది చెత్త కుప్ప కాబట్టి పోశా నీకెందుకు అని జవాబిచ్చాడు రౌత్రాయ్.మాటా మాటా పెరిగి డాక్టర్ ఆవేశం తో లోనికి వెళ్ళి తుపాకి తెచ్చి రౌత్రాయ్ మీద కాల్పులు జరిపాడు.ఎడమ కాలుకి బాగా గాయం అయి రక్తం కారుతుండటం తో కటక్ లోని  ఆసుపత్రికి చేర్చారు.కాల్పులు జరిపి తాపీ గా పేషంట్ లని చూస్తున్న డాక్టర్ ప్రధాన్ ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు.చుట్టుపక్కల వాళ్ళు ఆసుపత్రిని ధ్వంసం చేశారు. 

No comments:

Post a Comment