Thursday 18 August 2016

ఆదివాసీ ల పై పరిశోధన చేసిన విదేశీయునికి నివాళి ఈ రూపం లో....



బ్రిటన్ కి చెందిన ఆంత్రోపాలజిస్ట్ ఇంకా భారతీయ ఆదివాసీల జానపద కధలపై పరిశోధన చేసిన వెరియర్ ఎల్విన్ ని ఒక ఎనిమేషన్ పాత్ర గా సృష్టించి ఆ వ్యక్తి చేత వివిధ రాష్ట్రాల కి చెందిన గిరిజన సంస్కృతి లో ఉన్న కధలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు వివిధ రాష్ట్రాలకి చెందిన ఆదివాసి యువకులు. జార్ఖండ్,ఒడిస్సా ,అస్సాం,అరుణాచల్ ప్రదేశ్ ,మేఘాలయా లకి చెందిన వీరంతా భువనేశ్వర్ లోని సెంచూరియన్ యూనివర్శిటి లో జరుగుతున్న వర్క్ షాప్ లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.బ్రిటన్ లోని ఆదివాసి ఆర్ట్స్ ట్రస్ట్ అనే సంస్థ దీనికి సహాయపడుతున్నది.మధ్య ప్రదేశ్ లోని మంఝూర్ ఝలి కధలు,అరుణాచల్ ప్రదేశ్ లోని అబోటిని కధలు,నాగా లాండ్ లోని మేన్ టైగర్ స్పిరిట్ కధలు ,మణి పూర్ లోని తప్త కధలు,సిక్కిం లోని నై మకాల్ క్యొయంగ్ కధలు నిక్షిప్తం చేసి సి.డి లు ద్వారా విడుదల చేస్తారు.ఈశాన్య మరియు మధ్య భారత ఆదివాసి తెగల పై విస్త్రుతంగా పరిశోధనలు చేసిన వెరియర్ ఎల్విన్ ని వీటన్నిటిని వివరించే ఎనిమేటర్ పాత్ర గా సృష్టించి ఆయనకి అంజలి ఘటిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ తారా డగ్లస్ తెలిపారు.



No comments:

Post a Comment