Friday 30 September 2016

జయలలిత ఆరోగ్యం నిర్ధారిస్తూ ఫోటో విడుదల చేయాలి : కరుణానిధి



గత వారం రోజులు గా అనారోగ్య కారణాల తో అపోలో హాస్పిటల్ లో ఉన్న తమిళ నాడు ముఖ్యమంత్రిణి జయలలిత ఆరోగ్యం ఎలా ఉందో నిజాలు వెల్లడి చేయాలని ,అందుకు గాను ఆమె ప్రస్తుత ఫోటో ని ప్రజల కోసం పత్రికలకి విడుదల చేయాలని డి ఎం కె అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు.ఆమె ని సందర్శించడానికి  వెళ్ళిన మంత్రులు పొన్ రాధాకృష్ణన్ వంటి వారు ఎందుకని ఆ విషయం లో నోరు విప్పడం లేదన్నారు.నిజాలు ప్రజలకి తెలియాలని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే అధికార పక్ష ప్రతినిధి సరస్వతి మాట్లాడుతూ వైద్యుల కోరిక మేరకు ఆమె కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు.

No comments:

Post a Comment