Thursday 10 November 2016

ఇండోనేషియా లోని కొన్ని అద్భుత ప్రదేశాలు


ఇండోనేషియా రమారమి 18,000 పై చిలుకు ద్వీపాల తో కూడిఉన్న దేశం.అయితే వాటిల్లో జనాలు ఉండేది కేవలం ఆరు వేల దీవుల్లోనే అని చెప్పాలి.24 కోట్ల జనాభా తో 300 విభిన్న తెగలతో 250 భాషలతో అలరారుతున్న ఆ దేశం లో ఎన్నో చూడదగిన  ప్రదేశాలు ఉన్నాయి.బాలి,సుమత్రా దీవులు పర్యావరణ టూరిజం కి పేరెన్నిక గన్నవి.

ఈ కింద కనిపిస్తున్న ది లేక్ తోబా.వంద కి.మీ పొడవు,30 కి.మీ. వెడల్పు ఉండే చెరువు డబ్భై వేల ఏళ్ళ క్రితం అగ్నిపర్వతం పేలినప్పుడు ఏర్పడినది.నీళ్ళు వెచ్చగా ఉంటాయి.ఇక్కడికి పర్యాటకులు తరచూ వస్తుంటారు.


ఈ కింది చిత్రం బొరోబుడుర్ ,ఒక బోఉధ దేవాలయం. 8 వ లేదా 9 వశతాబ్దం లో శైలేంద్ర అనే రాజు కట్టించినవి.ఇది జావా ద్వీపం లో ఉన్నది.అయితే 14 వ శతాబ్దం లో ఈ నిర్మాణాన్ని గుర్తు దొరకని కారణాల తో అప్పటి పాలకులు వదిలి వేయగా ఒక అరణ్యం మధ్య లో కనుగొని పర్యాటకుల కోసం దీని తెరిచి ఉంచుతున్నారు.

No comments:

Post a Comment