Monday 14 November 2016

"బలియాత్ర" పండుగ సంబరాలు ఈ రోజునుంచే ...



ఈ రోజు బలియాత్ర పండుగ సంబరాలు ఒరిస్సా లోని కటక్ పట్టణం లో మహానది తీరాన మొదలవుతున్నాయి. కళింగ ప్రాంతానికి చెందిన జాలరులు తమ నౌకలపై అనేక శతాబ్దాల క్రితం ఇండోనేషియా వద్ద గల దీవులను చేరుకొని విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ పండుగని కొన్ని వందల ఏళ్ళ నుంచి జరుపుతున్నారు.వారం పాటు సాగే ఇక్కడి తిరునాళ్ళ లో ఈ రాష్ట్రం లోని వారే గాక,ఇతర రాష్ట్రాలనుంచి తమ కళాకృతులను తెచ్చి అమ్ముతుంటారు.ఏటా రమారమి 80 నుంచి వంద కోట్ల వ్యాపారం సాగుతుంది.దీనిని పల్లె శ్రీ మేళా అంటారు.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర్నుంచి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి పర్యావరణం నిమిత్తం అనుమతులు తీసుకు రావలసి వచ్చింది.


ఒరిస్సా లోని కేంద్రపడా నుంచి రసాబలి,పూరి నుంచి మాల్ పూవా,ధెంకనాల్ నుంచి బారా,కకేరా,..బారిపడా నుంచి మటం ముధి లు వంటి సంప్రదాయ వంటకాలు నోరు ఊరించనున్నాయి.మొత్తం మీద 1700 స్టాళ్ళు ఏర్పాటు అవుతాయని వార్త. దేశం లోని 28 రాష్ట్రాలనుంచి తమ ఉత్పత్తుల్ని అమ్మడానికి రానున్నారు.ట్రాన్స్ జెండర్స్ కి,అంగవికలాంగులకి సైతం ఈ సారి కొన్ని స్టాళ్ళు రిజర్వ్ చేశారు.



ఒరియా సాన్స్కృతిక వాతావరణానికి ప్రతిబింబం లా సాగే ఈ ఉత్సవాలలో అనేక కళా ప్రదర్శనలు సైతం ఉంటాయి. ఈ  నెల 22 దాక బలియాత్ర ఉత్సవాలు కొనసాగుతాయి. 

No comments:

Post a Comment