Sunday 22 January 2017

ముగ్గురు విద్యార్థుల్ని బహిష్కరించిన SFI...



కేరళ రాష్ట్రం లో ఎర్నాకులం మహారాజా కాలేజీ లో ప్రిన్సిపాల్ కుర్చీ ని తగలబెట్టిన విషయం లో   లో CPM పార్టీ కి అనుబంధం  గా ఉన్న SFI నుంచి ముగ్గురు విద్యార్థుల్ని ఆ సంఘం బహిష్కరించింది.CPM ఇంకా SFI రెండు వర్గాల నాయకులు ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ సంఘటన గత గురు వారం జరిగింది.గత నెల లో గోడల పై అసభ్య రాతలు రాసినందుకు ప్రిన్సిపాల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు దాని తో ఆ ముగ్గురు విద్యార్థుల ని అరెస్ట్ చేసి ఇటీవలనే బెయిల్ పై వదిలారు.బయటకి వచ్చిన ఆ ముగ్గురు ప్రిన్సిపాల్ కుర్చీ ని బయటకి తీసుకు వచ్చి నిప్పంటించారు.ఈ విషయం మీద ఆ రాష్ట్ర అసెంబ్లీ లో విపక్ష నేత రమెష్ చెన్నితల నిప్పులు చెరగడం తో ఈ చర్య తీసుకున్నారు.  

No comments:

Post a Comment