Friday 7 April 2017

డాక్టర్ ఇంకా రచయిత గా రాణిస్తున్న ఆ ప్రాంత వాసి ఎందరికి తెలుసు...?


                                                                Dr.Gumlat Maio

ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతో వైవిధ్యం ఉంది.కాని అది మిగతా ప్రపంచానికి తెలిసింది తక్కువ అనే చెప్పాలి.డాక్టర్ గుంలాట్ మేయొ మేఘాలయారాష్ట్రం లో Bordumsa అనే పట్టణం లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే మరో వైపు రచయిత గా కార్టునిస్ట్ గా తన ప్రతిభ ని చూపిస్తున్నారు.ఆయన ఫేస్ బుక్ పేజీ ని ఇప్పటి దాకా 4 మిలియన్ల మంది సందర్శించారు. ఆయన రాసిన Once upon a time in a college"  అనే ఆంగ్ల నవల ఇప్పటికి రెండు సంపుటులు గా వెలువడింది.ఇవి అమెజాన్,ఫ్లిప్ కార్ట్ ల లో లభ్యమవుతున్నాయి. ఖాళీ ఏ మాత్రం దొరికినా రచనలు చేస్తుంటానని తెలుపుతున్నారు.రస్కిన్ బాండ్,జెరోం కె జెరోం, కిరణ్ దేశాయ్ ,అరుంధతి రాయ్ ఇట్లా చాలా మంది రచయితల్లో ఒక్కో సంవిధానం తనకి నచ్చుతుందని ప్రాంతీయ భాషల్లో కాక ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇంగ్లీష్ లో రాసేవారు ఇప్పుడు పెర్గుతున్నారని తెలిపారు.


నాగా లాండ్ గురించి తెలిపే TemsulaAo  రచనలు,సిక్కిం నుంచి రాస్తున్న వారు బాగా అలరిస్తున్నారని అయితే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సంగీత ప్రియులని 20 నుంచి 50 రాక్ బ్యాండ్ లు ఈ ప్రాంతం నుంచి ఉన్నాయని రచనా రంగం లో దానితో పోలిస్తే తక్కువ గానే ఉన్నారని అభిప్రాయపడ్డారు.AIIMS ధిల్లీ లోను ,ఇటా నగర్ లోని రామకృష్ణ హాస్పిటల్ లోను ఉత్తర బెంగాల్ లోని మెడికల్ కాలేజి లోను గతం లో పనిచేశానని అన్నారు.

No comments:

Post a Comment