Thursday 24 August 2017

ఆ నటుడి కోసం 57 కేజీల ఇడ్లీ తయారు చేశారు.


తమిళ సినీ అభిమానుల స్టైలే వేరు.ఈ రోజు 24 న అజిత్ నటించిన వివేగం విడుదల అయిన సందర్భం గా చెన్నై లోని రాయపురంలో 57 కేజీల ఇడ్లీని తయారు చేశారు.ఎందుకంటే ఆ నటుడికి ఇది 57 వ సినిమా మరి.తమిళనాడు సమయిల్ కాలై తొళిలార్ మున్నేట్ర సంఘం ఆధ్వర్యం లో ఈ వంటకం వండి రాయపురం  లోని భరత్ థియేటర్ వద్ద ప్రదర్శనకి పెట్టారు.ఈ ఇడ్లీ మీద అజిత్ ముఖం ఉబ్బినట్లుగా చేశారు.గతం లో కూడా అబ్దుల్ కలాం,కవి భారతీయర్,కామరాజర్,మదర్ థెరిసా ఇలాంటి వారి ముఖాలతో ఇడ్లీలు తయారు చేశారు వీళ్ళు.   

No comments:

Post a Comment