Tuesday 30 January 2018

అడవి లో బయట పడిన అపురూప శిల్పసంపద -ఉనాకోటి



త్రిపుర రాష్ట్రం యొక్క రాజధాని అగర్తల కి సుమారు 178 కి.మీ.దూరం లో దట్టమైన అడవి లో  ఉనాకోటి అనే ఒక ప్రదేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఇంతకాలం ఈ అడవి లో ఉండిపోయిన గొప్ప శిల్పసంపదని చూడాలని ప్రపంచం  తపిస్తున్నది.ఎందుకంటే వీటి ప్రత్యేకతలే వేరు అని చెప్పాలి.పెద్ద పెద్ద గుట్టల మీద రాతి ని చూడచక్కని శిల్పాలు గా మలిచారు. ఇవి భారత దేశం లోని ఇతర గుళ్ళ లోని  శిల్పశైలి లో కాకుండా స్థానిక ప్రాచీన తెగల వారసత్వ వైవిధ్యాన్ని తెలుపుతుంది.


8 లేదా 9 వశతాబ్దం లో వీటిని చెక్కి ఉండవచ్చునని భావిస్తున్నారు.శివుడు,పార్వతి,గంగ,దుర్గ,గణేశుడు ఇలా వివిధ శిల్పాలు దర్శనమిస్తున్నాయి.30 నుంచి 40 అడుగుల శిల్పాలు చూడవచ్చును.ఆరుబయట గుట్టల లో ఇంతకాలం అరణ్యం లో ఎవరూ పెద్ద గా వీటిని పట్టించుకోలేదు. నార్త్ త్రిపుర లో జంప్యు హిల్స్ లో ఉన్న ఈ ప్రదేశాన్ని  ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది పరిచే దిశలో సాగుతున్నది.



      

1 comment:

  1. ఉపయుక్త సమాచారం. నెనర్లు.

    ReplyDelete