Sunday 22 July 2018

బోర్డు తిప్పేసిన మరో సంస్థ...



ద హేపీ ఫ్యూచర్ మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ పేరు తో తమిళనాడు ,ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాల్లో బ్రాంచీలు తెరిచిన సంస్థ  తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల బోర్డ్ తిప్పేసినట్లుగా ఈ రోజు పత్రిక ల్లో వెలుగు చూసింది.స్థానిక ప్రముఖుల తో ఓపెనింగ్ లు చేయించి కొన్ని నెలల పాటు ఆఫీస్ లు నడిపిన ఈ సంస్థ తమిళనాడు లోని కోయంబత్తూర్ లో ప్రధాన కార్యాలయాన్ని కలిగిఉంది.నిరుద్యోగులు కూడా ఈ సంస్థ లో ఉద్యోగాలు పొందడానికి పెద్ద మొత్తాలు చెల్లించినట్లు తెలుస్తున్నది.

తమ వెబ్ సైట్ లో అనేక సేవలు అందిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నది.ఎలక్ట్రానిక్స్,సూపర్ మార్కెట్,ఆర్గానిక్ ఉత్పత్తులు ఇంకా ఇతర రంగాల్లో సేవలు అందిస్తున్నట్లు ప్రకటనలు చేసింది. కొత్తగూడెం,ఖమ్మం ఇంకా అనేక చోట్ల ఫిర్యాదులు నమోదు అయినట్లు తెలుస్తున్నది. 

No comments:

Post a Comment