Tuesday 7 August 2018

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కధలు (పుస్తక పరిచయం)


పెద్దిభొట్ల సుబ్బరామయ్య పేరెన్నిక గన్న తెలుగు కధకులు.నిత్య జీవిత సత్యాలను ఎంతో హృద్యంగా చిత్రించి తనదైన శైలి లో తెలుగు పాఠకులకు అందించారు.ఆయన కధలను ఏరి అరసం సాహిత్య సంస్థ ప్రచురించిన పుస్తకం ఈ పెద్దిభొట్ల సుబ్బరామయ్య కధలు.దీనిలో 12 కధలు ఉన్నాయి.కళ్ళజోడు,అలజడి,దగ్ధ గీతం,సతీ సావిత్రి,కొళందవేలు బొమ్మ,చుక్కమ్మ కధ,ఇంగువ ఇంకా తదితర కధలు.మాన జీవితం లోని విషాద సన్నివేశాలను ఇంకా సమస్యలను అతి సామాన్య శైలి లో మనోరంజకంగా వెలయించారు.సాహిత్య అకాడెమీ గ్రహీత అయిన సుబ్బరామయ్య కధలను ప్రతి అభిరుచి కలిగిన పాఠకుడూ చదవాలి.

పేజీలు:112 ,వెల: రూ.50/-

ప్రతులకు: అభ్యుదయ రచయితల సంఘం,గుంటూరు జిల్లా శాఖ.
101,బృందావన్ పార్క్ రెసిడెన్సి,7వ లేన్,ఎస్.వి.ఎన్.కాలని,గుంటూరు-522006,సెల్:92915 30714  

No comments:

Post a Comment