Monday 17 July 2017

తెలుగు కుర్రాణ్ణి తన బర్త్ డే పార్టీ కి పిలిచిన హృతిక్ రోషన్...ఇంతకీ అతనెవరో తెలుసా..?



తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన దాసరి వెంకట విశ్వనాధ్ ని బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గత జనవరి లో జరిగిన తన పుట్టిన రోజు వేడుకకి అతిధి గా ఆహ్వానించాడు.విశ్వనాధ్ రెండు ఇంగ్లీష్ నవలలు రాశాడు ఇప్పడిదాకా.మొదటిది ఫారో అండ్ కింగ్ కాగా రెండవది ది విక్టోరియన్ అనేది.విశ్వనాధ్ స్వతహ గా హృతిక్ అభిమాని. ట్విట్టర్ ద్వారా తన అభిమానాన్ని చాటి పుస్తకాలను పంపాడు.వాటిని మెచ్చుకుని విశ్వనాధ్ ని తన బర్త్ డే కి ఆహ్వానించాడు. ఫోటో ఫోబియా ఇంకా నైస్టగమస్ అనే కంటి సంబంధ మైన సమస్యలతో  బాధపడుతున్నా వాటిని లెక్క చేయకుండా పురోగమిస్తున్న తెలుగు కుర్రాణ్ణి అభినందించాడు హృతిక్ రోషన్. 

Saturday 8 July 2017

రక్షణ దళాల అలవెన్స్ లు ఇలా పెరిగాయి



సియాచిన్ వంటి దుర్గమ ప్రదేశాల్లో పనిచేసే సైనికులకి అలవెన్స్ లు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి.గతం లో ఇవి రూ.14000 ఉండగా 30000 కి పెరిగాయి.ఆఫీసర్లకి 42500 దాకా పెరిగాయి.అంతే కాదు CRPF వంటి పేరా  మిలటరీ దళాలకి ఇంకా ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో  పనిచేసే వారికి సైతం 7వ వేతన కమీషన్ పెంచింది.శాంతి భద్రతలు ఉన్న ప్రదేశాల్లో పని చేసే దళాలకి రేషన్ సౌకర్యాన్ని ఎత్తి వేస్తున్నట్లు నిన్న గెజిట్ లో ప్రకటించారు.   

Friday 23 June 2017

మరో 39 స్మార్ట్ సిటీలను ఈ రోజు ప్రకటించారు..తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి ఏమిటంటే...



ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరో 30 స్మార్ట్ సిటీలను ప్రకటించింది.ఆంద్ర నుంచి అమరావతి,తెలంగాణా నుంచి కరీం నగర్ ఈ జాబితా లో చోటుచేసుకున్నాయి. అయితే చత్తిస్ ఘడ్ నుంచి నయా రాయ్ పూర్ ,బిలాస్ పూర్ రెండు సెలెక్ట్ కాగా తమిళ నాడు నుంచి తిరునల్వేలి,తూత్తుకుడి,తిరుచిరాపల్లి మూడు నగరాలు ఎన్నిక అయ్యాయి.మిగతావి వేరే రాష్ట్రాలకి చెందినవి.మొత్తం మీద ఈ విడత ప్రకటన తో 90 నగరాలు స్మార్ట్ సిటీలు గా ప్రకటించినట్లు అయింది.వీటన్నిటికి కలిపి 1,91,155 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నది.  

Monday 19 June 2017

భద్రాచలం డివిజన్ ని ఆంధ్రా ప్రాంతం లో కలపాలి: గొండ్వానా సంక్షేమ పరిషత్


బ్రిటీష్ వారి కాలం నుండి తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా  ఉన్న భద్రాచలం డివిజన్ ని ఆంధ్ర రాష్ట్రం లోనే కలపాలని,ఇప్పటికీ డివిజన్  లో నిలిచి ఉన్న అప్పటి నిర్మాణాలే దీనికి సాక్ష్యమని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సొందె వీరయ్య అన్నారు.1956 లో ఉన్న ప్రకారమే విభజనని మాత్రమే కె.సి.యార్. కోరారని కాని కొన్ని శక్తుల కి తలొగ్గి ఈ ప్రాంతాన్ని  తెలంగాణా లో కలిపారని,కేంద్రం ఈ విషయం లో పునరాలోచన చేయాలని అప్పుడు మాత్రమే ఇక్కడ గల ఆదివాసీ తెగలకి న్యాయం జరుగుతుందని తెలిపారు.ఈ డిమాండ్ తో భద్రాచలం లో నిన్న ఒక రోజు దీక్ష ని నిర్వహించారు. 

Sunday 28 May 2017

సుదర్శన్ పట్నాయక్ ...ఈ ఒక్క పేరు చాలు.



సుదర్శన్ పట్నాయక్ ...ఈ ఒక్క పేరు చాలు.సైకత కళ కి మన దేశం లో పర్యాయపదం ఆయన పేరు.జాతీయ,అంతర్జాతీయ ప్రాముఖ్యత గల రోజులను భావ యుక్తం గా ఇసుక లో శిల్పాలు గా మార్చి మనల్ని అలరించే వ్యక్తి ఆయన.అసలు ఆ రంగం ని ఎందుకు ఎలా ఎంచుకున్నారో సుదర్శన్ ఒక పత్రిక కి ఇటీవలనే చెప్పారు.ఆయన చిన్నతనం లో తండ్రి ని కోల్పోయారు ,బామ్మ పెన్షన్ తో చిన్నప్పుడు కుటుంబం అంతా గడిచేది.అది సరిపోక పక్క ఇంట్లో పనిమనిషి గా పనిచేశాడు.ఖాళీ గా ఉన్నప్పుడు తను పుట్టిన ఆ పూరి పట్టణం లోని బీచ్ కి వెళ్ళి ఇసుక తో రకరకాల గూళ్ళు నిర్మించేవాడు.ఇది కేవలం ఆర్ట్ మీద ఉన్న తనకున్న ఇష్టం తోనే చేశేవాడు.తప్ప ఎలాంటి ప్రతిఫలం కోసం కాదు.

ఒకసారి తను నిర్మించిన ఇసుక శిల్పాల్న్ని చూసిన విదేశీయులు అతడిని అభినందించారు.దానితో ఆసక్తి పెరిగి దానిని కొనసాగించాడు.రమారమి అయిదు ఏళ్ళు అలాగే పైసా ఆదాయం లేకుండా రోజు అలాంటివి బీచ్ లో నిర్మించేవాడు.ఇట్లా ఇసుక లో వేసేవి కొట్టుకుపోయేవి యే గదా..దీనివల్ల ఏం ప్రయోజనం అని కొంతమంది విమర్శించేవాళ్ళు.కాని ఎందుకనో అది తప్పనిపించేది..మనిషి జీవితం కూడా ఏదో ఒకరోజు పోయేదే అలా అని జీవించడం మానేస్తున్నామా.. అనిపించేది.కొన్నాళ్ళకి చూసే వాళ్ళు పెరిగారు.తన శైలిని ఇంకా మార్చుకొని రకరకాల ప్రయోగాలు ఆ ఇసుక లోనే చేశాడు.

బెర్లిన్ లో జరిగిన అంతర్జాతీయ సైకత పోటీ లో గోల్ మెడల్ వచ్చిన తర్వాత దేశ విదేశాల్లో అతని పేరు మారుమోగింది.ఆ తర్వాత ఒకటా రెండా ఎన్నో పోటీల్లో ఫాల్గొని సైకత కళ కి మన దేశం లో పర్యాయపదం గా మారాడు.పెద్ద గా చదువుకోని ఒక నాటి బాల కార్మికుడు ఈ కళ ద్వారా నే పద్మశ్రీ ఇంకా డాక్టరేట్లు పొందాడు.పట్టు విడువకుండా తన హృదయం చెప్పే పనిని చేసేవారికి గొప్పదనం వెదుక్కుంటూ వస్తుందనడానికి పట్నాయక్ జీవితమే ఓ ఉదాహరణ.ఒడియా ప్రజలు తమ కళా ప్రతినిది గా ఈయనని ఎంతో అభిమానిస్తారు. 

Sunday 9 April 2017

అతను ఈశాన్య రాష్ట్రాల మైకేల్ జాన్సన్ అని చెప్పాలి.




ఈశాన్య రాష్ట్రాల ల లో రాక్ సింగర్ గా ప్రసిద్దుడైన Michael M Sailo గత  శుక్రవారం అర్ధ రాత్రి మిజోరాం రాస్ట్ర రాజధాని ఐజ్వాల్ లో ఒక బైక్ ప్రమాదం లో మృతి చెందాడు.రాక్,హిప్ హాప్,రాప్,మెటల్ ప్రక్రియల్లో తనకంటూ ఒక బాణీ ని ఏర్పరచుకున్నాడు.అతని భార్య Spi Bawitlung కూడా సింగర్ గా ఉన్నది.అనేక పాటలు పాడి,రాసి,మ్యూజిక్ సమకూర్చి అనేక మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన మరణం ఈశాన్య భారతం ని శోక సముద్రం లో ముంచింది.

Friday 7 April 2017

డాక్టర్ ఇంకా రచయిత గా రాణిస్తున్న ఆ ప్రాంత వాసి ఎందరికి తెలుసు...?


                                                                Dr.Gumlat Maio

ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతో వైవిధ్యం ఉంది.కాని అది మిగతా ప్రపంచానికి తెలిసింది తక్కువ అనే చెప్పాలి.డాక్టర్ గుంలాట్ మేయొ మేఘాలయారాష్ట్రం లో Bordumsa అనే పట్టణం లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే మరో వైపు రచయిత గా కార్టునిస్ట్ గా తన ప్రతిభ ని చూపిస్తున్నారు.ఆయన ఫేస్ బుక్ పేజీ ని ఇప్పటి దాకా 4 మిలియన్ల మంది సందర్శించారు. ఆయన రాసిన Once upon a time in a college"  అనే ఆంగ్ల నవల ఇప్పటికి రెండు సంపుటులు గా వెలువడింది.ఇవి అమెజాన్,ఫ్లిప్ కార్ట్ ల లో లభ్యమవుతున్నాయి. ఖాళీ ఏ మాత్రం దొరికినా రచనలు చేస్తుంటానని తెలుపుతున్నారు.రస్కిన్ బాండ్,జెరోం కె జెరోం, కిరణ్ దేశాయ్ ,అరుంధతి రాయ్ ఇట్లా చాలా మంది రచయితల్లో ఒక్కో సంవిధానం తనకి నచ్చుతుందని ప్రాంతీయ భాషల్లో కాక ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇంగ్లీష్ లో రాసేవారు ఇప్పుడు పెర్గుతున్నారని తెలిపారు.


నాగా లాండ్ గురించి తెలిపే TemsulaAo  రచనలు,సిక్కిం నుంచి రాస్తున్న వారు బాగా అలరిస్తున్నారని అయితే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సంగీత ప్రియులని 20 నుంచి 50 రాక్ బ్యాండ్ లు ఈ ప్రాంతం నుంచి ఉన్నాయని రచనా రంగం లో దానితో పోలిస్తే తక్కువ గానే ఉన్నారని అభిప్రాయపడ్డారు.AIIMS ధిల్లీ లోను ,ఇటా నగర్ లోని రామకృష్ణ హాస్పిటల్ లోను ఉత్తర బెంగాల్ లోని మెడికల్ కాలేజి లోను గతం లో పనిచేశానని అన్నారు.