Wednesday 25 April 2018

ఈ పేరు తో హోటల్ ని ఎవరైనా ఊహించగలరా..?


ఓల్గా సే గంగా అనే ప్రసిద్ధ నవల  అందరకీ తెలిసిందే.రాహుల్ సాంకృత్యాయాన్ రచించిన ఆ పుస్తకానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది.ఎవరైనాపుస్తకం చదువుతారు కాకపోతే మంచి రచన గా గుర్తుంచుకుంటారు.కాని పశ్చిమ గోదావరి జిల్లా లోని కుకునూరు అనే మండల కేంద్రం లో మటుకు ఆ పుస్తకం పేరు ని తమ హోటల్ కి పెట్టుకున్నాడు ఒక పుస్తక ప్రియుడు.ఇక్కడ పైన చూస్తున్నారు గా ఆ చిత్రందాని గురించి ఆ యజమాని రాం బాబు మాట్లాడుతూ వారి తండ్రి గారు ఈ పేరు పెట్టినట్లు దానిని తాను కొనసాగిస్తున్నట్లు తెలుపుతున్నారు.ఈ స్పూర్తి తో ఇంకా అనేకామంది ఇటువంటి మంచి విషయాల్ని అనుకరిస్తే బాగుంటుంది కదూ ..! 

Tuesday 30 January 2018

అడవి లో బయట పడిన అపురూప శిల్పసంపద -ఉనాకోటి



త్రిపుర రాష్ట్రం యొక్క రాజధాని అగర్తల కి సుమారు 178 కి.మీ.దూరం లో దట్టమైన అడవి లో  ఉనాకోటి అనే ఒక ప్రదేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఇంతకాలం ఈ అడవి లో ఉండిపోయిన గొప్ప శిల్పసంపదని చూడాలని ప్రపంచం  తపిస్తున్నది.ఎందుకంటే వీటి ప్రత్యేకతలే వేరు అని చెప్పాలి.పెద్ద పెద్ద గుట్టల మీద రాతి ని చూడచక్కని శిల్పాలు గా మలిచారు. ఇవి భారత దేశం లోని ఇతర గుళ్ళ లోని  శిల్పశైలి లో కాకుండా స్థానిక ప్రాచీన తెగల వారసత్వ వైవిధ్యాన్ని తెలుపుతుంది.


8 లేదా 9 వశతాబ్దం లో వీటిని చెక్కి ఉండవచ్చునని భావిస్తున్నారు.శివుడు,పార్వతి,గంగ,దుర్గ,గణేశుడు ఇలా వివిధ శిల్పాలు దర్శనమిస్తున్నాయి.30 నుంచి 40 అడుగుల శిల్పాలు చూడవచ్చును.ఆరుబయట గుట్టల లో ఇంతకాలం అరణ్యం లో ఎవరూ పెద్ద గా వీటిని పట్టించుకోలేదు. నార్త్ త్రిపుర లో జంప్యు హిల్స్ లో ఉన్న ఈ ప్రదేశాన్ని  ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది పరిచే దిశలో సాగుతున్నది.



      

Thursday 7 December 2017

డాన్స్ చేస్తూ చిక్కిన ఆ పోలీస్ అధికారి


పశ్చిమ బెంగాల్ లోని హీరా పూర్ అనే పోలీస్ స్టేషన్ లో ASI గా పనిచేస్తున్న కృస్ణ సదన్ మండల్ కి తాను కోరుకున్న చిత్తరంజన్ స్టేషన్ కి బదిలీ అయింది.చివరి రోజున ఆ ఆనందాన్ని చక్కగా తనివి దీరా డాన్స్ వేస్తూ వ్యక్తపరుచుకున్నాడు.మొత్తానికి కొంతమంది ఎలాగో ఈ వ్యవహారాన్ని వీడియో తీశారు. దానితో ఇది వైరల్ అయి ఉన్నతాధికారులు ఈయన మీద విచారణకి ఆదేశించారు.ఈ వీడియో డిసెంబర్ 2 న తీసినట్లుగా ఉన్నది.సర్వీస్ రివాల్వర్,యూనిఫాం ధరించి స్టేషన్ లో డాన్స్ చేస్తుండడం తో అసాన్సోల్-దుర్గాపోర్ కమీషనర్ ఈ విషయం లో విచారణకి ఆదేశించారు. 

Sunday 26 November 2017

ఇప్పుడు ఈ కొత్తరకం కోడి మాంసానికి గిరాకి పెరుగుతోంది..



చత్తిస్ ఘడ్ లోని దంతెవాడ ప్రాంతం అనగానే మావోఇస్ట్ ఘటనలతో అట్టుడుకుతున్న ఏరియా గా అనుకుంటాం.అయితే ఇప్పుడు ఇక్కడ పెంచబడుతున్న "కడక్నాత్" అనే నల్లరంగు కోళ్ళు వాటి మాంసం తో అందరని ఊరిస్తున్నాయి.ఇవి చూపులకే కాదు వీటి మాసం కూడా నల్ల రంగు లోనే ఉంటుంది.అంతేకాదు గుడ్లు కూడా అదే కలర్ లో ఉంటాయి.స్థానికం గా కలీ మాసి రకం కోళ్ళు అని కూడా అంటారు.దీని మాంసం ధర మామూలు బ్రాయిలర్ కోడి తో పోల్చితే మూడు రెట్లు ఎక్కువ.పోషక విలువలు సైతం ఎక్కువ అని అంటున్నారు.సుమారు 76 మంది వ్యాపారస్తులు లక్ష కోళ్ళ దాకా పెంచుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం సైతం సహకారమందిస్తోంది.మన హైదరాబాద్ లో వీటి మాసం వడ్డించే హోటళ్ళు నాలుగు దాకా ఉన్నాయి.మహారాష్ట్ర,గుజరాత్ లకి కూడా సరఫరా జరుగుతోంది.భవిష్యత్ లో ఇంకా విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


మధ్య ప్రదేశ్ లోని ఝబువా ,ధార్ జిల్లాల్లో అసలు ఈ కోళ్ళ పెంపకం ముందు జరిగింది.ఆ తర్వాత నెమ్మది గా చత్తిఘడ్ లోని దంతె వాడ కి ఈ కోళ్ళు తేబడ్డాయి.వ్యాపారం బాగా ఉండడం తో ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారం తోడై మూడు పువ్వులు ఆరు కాయలు గా వృద్ధి చెందుతోంది.ఈ దంతెవాడ లోని ప్రఖ్యాత దేవత దంతేశ్వరీ మాత వల్ల ఈ ప్రాంతం ఎప్పటి నుంచో పేరెన్నిక గన్నది.చుట్టుపక్కల జిల్లాలు సుక్మా,బిజాపూర్ మొన్నటి దాకా నక్సల్ ప్రభావిత హింస కి చిరునామా గా ఉన్నప్పటికీ క్రమేణా వాతావరణం మారుతున్నది.

Saturday 2 September 2017

ఆ రచయిత ని ముప్పతిప్పలు పెడుతున్న జార్ఖండ్ వాసులు..


హన్స్ దా సౌవేంద్ర శేఖర్ (34) జార్ఖండ్ లోని పకూర్ జిల్లా లో బేల్ దంగా అనే బ్లాక్ లో ప్రభుత్వ వైద్యుని గా పనిచేస్తున్నారు.దానితో పాటు ఈయన రచయిత కూడా.ద ఆదివాసి విల్ నాట్ డాన్స్ అనే కధల సంపుటిని రెండేళ్ళ క్రితం వెలువరించాడు.ఈ ఆంగ్ల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం కూడా దక్కింది అంతేకాదు హిందూ పేపర్ దీనికి ఉత్తమ ఫిక్షన్ కి ఇచ్చే పురస్కారం ఇచ్చింది.అయితే ఈ పుస్తకం ఇటీవల హిందీ భాష లో అనువాదం కావడం తో చదివిన జార్ఖండ్ వాసులు చాలామంది ఆగ్రహం తో ఊగిపోతున్నారు. సంతాలీ ఆదివాసి స్త్రీలని అవమానించే విధంగా వర్ణనలు ఉన్నాయని ఇంకా స్థానిక నాయకులైన వారిని చిన్నబుచ్చే కొన్ని కధలున్నాయని అంటున్నారు.జార్ఖండ్ రాష్ట్ర విముక్తి కై పోరాడిన నిర్మల్ మహతో పేరు ని ఒక దుష్ట పాత్రకి పెట్టారని ,ఆదివాసి దేవుళ్ళని,సంస్కృతిని కించపరిచే విధంగా ఈ పుస్తకం ఉందని కనుక సెప్టెంబర్ 4 లోపు ఈ పుస్తకానికి సంబందించిన అన్ని కాపీల్ని తగలబెట్టాలని వివిధ సంఘాలు పిలుపునిచ్చాయి.

అయితే హన్స్ దా ని సమర్దిస్తూ కొంతమంది మేధావులు సంతకాల సేకరణ చేస్తున్నారు. ఫేస్ బుక్ , ట్విట్టర్ ల లో దుమ్మెత్తి పోసుకుంటూ మొత్తానికి ఈ రచయిత కి పెద్ద పబ్లిసిటీ నే చేస్తున్నారు.ఈ రోజు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు భోగట్టా.అయితే ఈ రచయిత కూడా సంతాలీ తెగ కి చెందిన వారే.అదీ కొసమెరుపు.   

Thursday 24 August 2017

ఆ నటుడి కోసం 57 కేజీల ఇడ్లీ తయారు చేశారు.


తమిళ సినీ అభిమానుల స్టైలే వేరు.ఈ రోజు 24 న అజిత్ నటించిన వివేగం విడుదల అయిన సందర్భం గా చెన్నై లోని రాయపురంలో 57 కేజీల ఇడ్లీని తయారు చేశారు.ఎందుకంటే ఆ నటుడికి ఇది 57 వ సినిమా మరి.తమిళనాడు సమయిల్ కాలై తొళిలార్ మున్నేట్ర సంఘం ఆధ్వర్యం లో ఈ వంటకం వండి రాయపురం  లోని భరత్ థియేటర్ వద్ద ప్రదర్శనకి పెట్టారు.ఈ ఇడ్లీ మీద అజిత్ ముఖం ఉబ్బినట్లుగా చేశారు.గతం లో కూడా అబ్దుల్ కలాం,కవి భారతీయర్,కామరాజర్,మదర్ థెరిసా ఇలాంటి వారి ముఖాలతో ఇడ్లీలు తయారు చేశారు వీళ్ళు.   

Tuesday 15 August 2017

మేఘాలయ వెళితే ఈ నది అందాలు చూడాలిసిందే...!



మేఘాలయా రాష్ట్రాన్ని చూడవలసి వస్తే షిల్లాంగ్ తో పాటు ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి.ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా ఇతర రాష్ట్రాల లో లాగా పర్యావరణ విధ్వంసం ప్రారంభం కాలేదు.ఉమంగట్ నది ఇప్పుడు టూరిస్ట్ ల్ని బాగా ఆకర్షిస్తోంది.ఈ నది లోని నీళ్ళు తేటా తెల్లం గా అడుగు భాగం చక్కగా కనబడేలా ఉంటుంది.చలి కాలం లో మరీ బాగుంటుంది.మన దేశీయులు తో బాటు బంగ్లా దేశీయులు ఉమ్మడి గా దీని లొని చేపల్ని పట్టుకుంటారు.ఒక  రౌండ్ వేసి రావడానికి పడవల వాళ్ళు మూడు వందల రూపాయాలు వసూలు చేస్తున్నారు.