ఈ రోజు ఢిల్లీ లో జరిగిన యూత్ కన్వెన్షన్ లో నరేంద్ర మోడి తో కలసి తెలుగు దేశం అధినేత చంద్రబాబు వేదిక పంచుకున్నారు.అటల్ బీహారి వాజపేయి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలని పొగడ్తలతో ముంచెత్తారు.చంద్ర బాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు హైదరాబాద్ కేసి చూసేవారు.ఆ తరువాత ఇప్పుడు గుజరాత్ కేసి చూపిస్తున్నారు అని మోడి అన్నారు.దేశం లో అవినీతి ని అరికట్టడం లో భాగంగా 500,1000 రూపాయల నోట్లను రద్దు చేయవలసిన అవసరం ఉందని చంద్ర బాబు అన్నారు.
సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనే ఎన్.జి.వొ. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
No comments:
Post a Comment