Sunday 4 October 2020

ఆ రోజుల్లో ఇలాంటి శిల్పాల్ని చెక్కడం లో ఉద్దేశ్యం ఏమిటో..?

 


భోరం దేవ్ ఆలయం,ఇది చత్తీస్ ఘడ్ లో ఉన్న పురాతన దేవాలయాల్లో ఒకటి. ఇంచు మించు వెయ్యి ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ నిర్మాణం శివుని కి అంకితం చేయబడింది.రాయపూర్ కి 125 కి.మీ. దూరం లో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే కబీర్ ధాం జిల్లా లోని కేవర్ధా కి 18 కి.మీ.దూరం లో ఉంటుంది.ఆలయం ఉన్న ఊరి పేరు చౌరా గాం.


నగర వంశానికి చెందిన రామచంద్ర ఈ ఆలయాన్ని నిర్మించాడు.హయ రాజవంశానికి చెందిన అంబికా దేవి ని ఈయన వివాహమాడాడు.చరిత్రని, పురాతన దేవాలయ నిర్మాణాల్ని పరిశీలించే వారికి ఇక్కడ ఎంతో సమాచారం దొరుకుతుంది.ఒరిస్సా లోని కొన్ని ఆలయాల నిర్మాణ పద్ధతులు ఇక్కడ కనిపిస్తాయి.అదే సమయం లో తనదైన ప్రత్యకత కూడా ఈ ఆలయానికి ఉంది.


ఖజురహో వంటి ఆలయాల తీరు లోనే ఇక్కడ కూడా అనేక శృంగార భంగిమల్లో స్త్రీ పురుషులు క్రీడించే శిల్పాలు విరివిగా ఆలయం గోడల పై కనిపిస్తాయి.అదొక్కటే కాదు,వాస్తు నిర్మాణ విశేషాలు కూడా ఆసక్తికరం గా ఉంటాయి.మార్చి నెల చివరి వారం లో ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి.  

No comments:

Post a Comment