Saturday 23 April 2016

కంప్యూటర్ వినియోగం లో వెనుకబడిన తెలుగు రాష్ట్రాలు.



తెలంగాణా,ఆంధ్ర రెండు రాష్ట్రాలు కంప్యూటర్ వినియోగం లో బయటకి చెప్పుకుంటున్నంత గొప్ప గా ఏమీ లేవని నేషనల్ శాంపిల్ సర్వె వెల్లడి చేసింది.14-29 మధ్య వయసు లో ఉన్నవారిని ఈ  సర్వె లో లెక్కించారు.ప్రతి వెయ్యిమంది లో తెలంగాణ లో 490 మంది కంప్యూటర్ వినియోగించే వారిగా తేలగా అదే ఆంధ్ర లో ఈ సంఖ్య 463 గా ఉంది.అయితే మిగిలిన దక్షిణాది రాష్ట్రాల  లో ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది.తమిళనాడు లో 588 మంది గా ఉండగా,కర్నాటక లో 552 మంది గా తేలింది.కేరళ 810 మంది తో అగ్ర స్థానం లో ఉంది.మెడికల్ ఇంకా ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో కూడా గణనీయమైన సంఖ్యలో  చేరవలసిన అవసరాన్ని  సూచిస్తున్నది. 

No comments:

Post a Comment