Sunday 24 July 2016

"పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మా జాతీయ కవి ని అవమానించింది."



ఈ నెల 13 వ తేదీన నేపాలీ జాతీయ కవి గా గౌరవింపబడే భానుభక్త ఆచార్య యొక్క 202 వ జయంతి వేడుకలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జరిపిందని దానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ,గవర్నర్ కేసరి నాధ్ త్రిపాఠి  తో పాటుగా మమతా బెనర్జీ హాజరయ్యారని కాని గూర్ఖా ప్రతినిధుల్ని ఒక్కర్ని కూడా వేదిక మీదికి పిలవకపోవడం తమ జాతి కి తీరని అవమానంగా భావిస్తున్నామని GTA ప్రధాన కార్యనిర్వహణాధికారి బిమల్ గురుంగ్ ఆరోపించారు.దానికి నిరసనగా నిన్న శనివారం డార్జిలింగ్ లోని గూర్ఖా రంగ్ మంచ్ భవనం లో ఆ కవి జయంతి వేడుకల్ని ప్రత్యేకంగా జరిపారు.నేపాలీ సాహిత్య సమ్మేళన్ అధ్యక్షుడు జీవన్ నాం డాంగ్ మాట్లాడుతూ జూలై 13 న ఆ కార్యక్రమాన్ని టి.వి. లో ప్రసారం చేసినపుడు చూడగా దాన్ని ఆసాంతమూ ఇంగ్లీష్ భాష లో నిర్వహించారని,అందుకు తమకు అభ్యంతరం లేదు గాని తమ భాష లోకి దాన్ని అనువదించకపోవడం దారుణమని అన్నారు.జాయ్ కాక్టస్ మాట్లాడుతూ గూర్ఖాల్ని విభజించాలని బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.వివిధ సాంస్కృతికోత్సవాలు ఈ వేదిక పై జరిగాయి.

No comments:

Post a Comment