Sunday 21 August 2016

కేరళ లో బీఫ్ ఎందుకని ఫేవరేట్ కూర..?



మన దేశం లో కేరళ రాష్ట్రం లోని ప్రజల టేస్టే వేరు.బీఫ్ ఫ్రై అనేది చాలా సాధారణంగా తినే వంటకం.క్రైస్తవులు,ముస్లింలనే కాదు హిందువుల లో కూడా చాలా మంది సర్వ సాధారణంగా  తింటారు.దోసె,ఇంకా ఇతర వాటి తో కలిపి తింటారు.అందు లోను నస్రాని తీరు లో చేసే బీఫ్ కి ఆదరణ ఎక్కువ.కేరళ లో ముస్లిం లు 23 శాతం,క్రైస్తవులు 19 శాతం,హిందువులు 56 శాతం ఉంటారు.పండుగలు కాని,తినడం లో గాని కలిసి మెలిసి చేసుకొనే ఆచారం మొదటి నుంచి ఎక్కువ.మతాల మధ్య అంతర్వివాహాలు సాధారణమైన విషయం.అన్ని ఫుడ్ ఐటంస్ ని బోర్డ్ మీద రాసినట్లే బీఫ్ ని కూడా రాస్తారు.1950 ల నుంచి కమ్యూనిజం  ప్రభావం ఎక్కువ కావడం,మతాల మధ్య సామరస్య ధోరణి ఇలాంటివి కేరళ ని బీఫ్ విషయం లో మిగతా రాష్ట్రాల నుంచి వేరు గా ఉంచిందని చెప్పాలి.

No comments:

Post a Comment