Monday 22 August 2016

విడాకులు పొందటం కూడా కష్టం కావడమే దీనికి కారణమా...?



దంపతులు విడి పోవడం ఇంకా విడాకులు తీసుకోవడం వంటివి కేవలం పట్టణాలకి ,నగరాలకే పరిమితం కాలేదు,మన దేశం లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక మాదిరి పట్టణాల్లో కూడా ఈ ట్రెండ్ పెరుగుతున్నదని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి.2011 లో తీసిన జనాభా లెక్కల్ని అనుసరించి చూస్తే ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా  పై స్థానం లో ఉంది.28,754 మంది వేరు పడిన వాళ్ళు ఉండగా, తెలంగాణా లో డైవర్స్ తీసుకున్నవాళ్ళు కరీం నగర్ జిల్లా లో ఎక్కువ గా ఉన్నారు.7,922 మంది అక్కడ సంఖ్య అని భోగట్టా.ఈ గణాంకాలు హైదరా బాద్ లోని వారి కంటే ఎక్కువ,అక్కడ వేరు పడి జీవిస్తున్న వారు 8,195 మంది కాగా కోర్ట్ నుంచి విడాకులు తీసుకున్నవారు 3,912 గా ఉంది.ఇక విశాఖ లో సెపరేట్ అయిన వారు 19,689 కాగా విడాకులు పొందిన వారు 3,782 గా ఉన్నారు.డైవర్స్ తీసుకున్న వారి కంటే ,తీసుకోకుండా వేరు గా జీవిస్తున్న వారే ఎక్కువ.దేశం మొత్తం మీద చెప్పాలంటే సెపరేట్ గా ఉంటున్న వారు 35,35,202 మంది కాగా విడాకులు పొందిన వారు 13,62,316 మంది మాత్రమే.

No comments:

Post a Comment