Monday 12 September 2016

జీన్స్ తయారీ లోకి వస్తోన్న రాం దేవ్ బాబా ...



దాదాపు గా 500 రకాల ఉత్పత్తుల్ని స్వదేశీ పేరు తో పతంజలి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అమ్ముకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.రాం దేవ్ బాబా స్థాపించిన ఈ కంపెనీ త్వరలో జీన్స్ తయారీ లొకి దిగబోతున్నది.ఈ మేరకు ఒక విదేశీ సంస్థ తో చర్చలు జరుగుతున్నాయి.పూర్తిగా విదేశీ తరహా దుస్తులు గా చెప్పబడే జీన్స్ ని మార్కెట్ ఏ పేరు తో చేస్తారో వేచి చూడవలసిందే.1800 సంవత్సరం లో ఇటలీ లోని జెనోవా నుంచి అమెరికా కి ఈ జీన్స్ లు రావడం జరిగింది.మొదట్లో తాపీ పనివాళ్ళు,రైతులు,ఇతర మోటు పనిచేసేవారు ఈ డెనిం తో చేసిన జీన్స్ ని ధరించేవారు.పోను పోను అమెరికన్ పాప్ కల్చర్ లో ఒక భాగమయ్యి క్రమేణా అనేక దేశాల్లో జీన్స్ విస్తరించింది.

Tuesday 6 September 2016

ఆ పుస్తకాలే నన్ను తీర్చిదిద్దాయి అంటున్నదామె



Arya fell through the fault ఈ ఏడాది ఓం ప్రచురణకర్తలు పబ్లిష్ చేసిన ఈ బుక్ ని రాసినది మరెవరో కాదు ముంబాయి కి చెందిన రీనిత మల్ హోత్ర హోర అనే ఆమె,ప్రస్తుతం హాంగ్ కాంగ్ లో ఒక రేడియో లో పనిచేస్తున్నారు.ఈ కధ మొత్తం శాన్ ఫ్రాన్సిస్కో లో వలస వెళ్ళిన భారతీయ కుటుంబం నేపధ్యం లో సాగుతుంది.దీని లో ని ఆర్య అనే కుర్రవాని పాత్ర ప్రధానమైనది.ఒకవేపు భారతీయ ఇతిహాసం రామాయణం  ని తీసుకొని దానికి సమకాలీనతని జోడించారు.రీనిత ఆయుర్వేదం,ఆర్దిక సంబంధ విషయాలపై గతం లో కొన్ని పుస్తకాలు రాశారు.చిన్నప్పటినుంచి జేన్ ఆస్టిన్ రచనలు ఆసక్తి గా చదివేదాన్నని ఆ నవలల పఠనమే తనని రచయిత్రి గా తీర్చిదిద్దిందని చెబుతున్నారు.

Monday 22 August 2016

విడాకులు పొందటం కూడా కష్టం కావడమే దీనికి కారణమా...?



దంపతులు విడి పోవడం ఇంకా విడాకులు తీసుకోవడం వంటివి కేవలం పట్టణాలకి ,నగరాలకే పరిమితం కాలేదు,మన దేశం లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక మాదిరి పట్టణాల్లో కూడా ఈ ట్రెండ్ పెరుగుతున్నదని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి.2011 లో తీసిన జనాభా లెక్కల్ని అనుసరించి చూస్తే ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా  పై స్థానం లో ఉంది.28,754 మంది వేరు పడిన వాళ్ళు ఉండగా, తెలంగాణా లో డైవర్స్ తీసుకున్నవాళ్ళు కరీం నగర్ జిల్లా లో ఎక్కువ గా ఉన్నారు.7,922 మంది అక్కడ సంఖ్య అని భోగట్టా.ఈ గణాంకాలు హైదరా బాద్ లోని వారి కంటే ఎక్కువ,అక్కడ వేరు పడి జీవిస్తున్న వారు 8,195 మంది కాగా కోర్ట్ నుంచి విడాకులు తీసుకున్నవారు 3,912 గా ఉంది.ఇక విశాఖ లో సెపరేట్ అయిన వారు 19,689 కాగా విడాకులు పొందిన వారు 3,782 గా ఉన్నారు.డైవర్స్ తీసుకున్న వారి కంటే ,తీసుకోకుండా వేరు గా జీవిస్తున్న వారే ఎక్కువ.దేశం మొత్తం మీద చెప్పాలంటే సెపరేట్ గా ఉంటున్న వారు 35,35,202 మంది కాగా విడాకులు పొందిన వారు 13,62,316 మంది మాత్రమే.

Sunday 21 August 2016

కేరళ లో బీఫ్ ఎందుకని ఫేవరేట్ కూర..?



మన దేశం లో కేరళ రాష్ట్రం లోని ప్రజల టేస్టే వేరు.బీఫ్ ఫ్రై అనేది చాలా సాధారణంగా తినే వంటకం.క్రైస్తవులు,ముస్లింలనే కాదు హిందువుల లో కూడా చాలా మంది సర్వ సాధారణంగా  తింటారు.దోసె,ఇంకా ఇతర వాటి తో కలిపి తింటారు.అందు లోను నస్రాని తీరు లో చేసే బీఫ్ కి ఆదరణ ఎక్కువ.కేరళ లో ముస్లిం లు 23 శాతం,క్రైస్తవులు 19 శాతం,హిందువులు 56 శాతం ఉంటారు.పండుగలు కాని,తినడం లో గాని కలిసి మెలిసి చేసుకొనే ఆచారం మొదటి నుంచి ఎక్కువ.మతాల మధ్య అంతర్వివాహాలు సాధారణమైన విషయం.అన్ని ఫుడ్ ఐటంస్ ని బోర్డ్ మీద రాసినట్లే బీఫ్ ని కూడా రాస్తారు.1950 ల నుంచి కమ్యూనిజం  ప్రభావం ఎక్కువ కావడం,మతాల మధ్య సామరస్య ధోరణి ఇలాంటివి కేరళ ని బీఫ్ విషయం లో మిగతా రాష్ట్రాల నుంచి వేరు గా ఉంచిందని చెప్పాలి.

Thursday 18 August 2016

ఆదివాసీ ల పై పరిశోధన చేసిన విదేశీయునికి నివాళి ఈ రూపం లో....



బ్రిటన్ కి చెందిన ఆంత్రోపాలజిస్ట్ ఇంకా భారతీయ ఆదివాసీల జానపద కధలపై పరిశోధన చేసిన వెరియర్ ఎల్విన్ ని ఒక ఎనిమేషన్ పాత్ర గా సృష్టించి ఆ వ్యక్తి చేత వివిధ రాష్ట్రాల కి చెందిన గిరిజన సంస్కృతి లో ఉన్న కధలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు వివిధ రాష్ట్రాలకి చెందిన ఆదివాసి యువకులు. జార్ఖండ్,ఒడిస్సా ,అస్సాం,అరుణాచల్ ప్రదేశ్ ,మేఘాలయా లకి చెందిన వీరంతా భువనేశ్వర్ లోని సెంచూరియన్ యూనివర్శిటి లో జరుగుతున్న వర్క్ షాప్ లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.బ్రిటన్ లోని ఆదివాసి ఆర్ట్స్ ట్రస్ట్ అనే సంస్థ దీనికి సహాయపడుతున్నది.మధ్య ప్రదేశ్ లోని మంఝూర్ ఝలి కధలు,అరుణాచల్ ప్రదేశ్ లోని అబోటిని కధలు,నాగా లాండ్ లోని మేన్ టైగర్ స్పిరిట్ కధలు ,మణి పూర్ లోని తప్త కధలు,సిక్కిం లోని నై మకాల్ క్యొయంగ్ కధలు నిక్షిప్తం చేసి సి.డి లు ద్వారా విడుదల చేస్తారు.ఈశాన్య మరియు మధ్య భారత ఆదివాసి తెగల పై విస్త్రుతంగా పరిశోధనలు చేసిన వెరియర్ ఎల్విన్ ని వీటన్నిటిని వివరించే ఎనిమేటర్ పాత్ర గా సృష్టించి ఆయనకి అంజలి ఘటిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ తారా డగ్లస్ తెలిపారు.



Monday 8 August 2016

జాతీయ గీతాన్ని పాడటం లో తప్పు లేదు: ఎం.ఏ ఖలీద్



అలహాబాద్ లోని సైదా బాద్ లో ఉన్న ఒక పాఠశాల యాజమాన్యం జాతీయ గీతం పాడటాన్ని వ్యతిరేకించిన నేపధ్యం లో నేడు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.ముంబాయి లో అనేక పాఠశాలలు,కాలేజీ లను నడిపే అంజుమన్ -ఎ-ఇస్లాం ట్రస్ట్ అధ్యక్షుడు జహీర్ కాజీ ఈ చర్యని ఖండిస్తూ ముందు దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలని ,జాతీయ గీతాన్ని పాడగూడదని   నిషేధించరాదని తెలిపారు.సామాజిక కార్యకర్త ఎం.ఏ.ఖలీద్ మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం అజాద్ వంటి వారే జాతీయ గీతం పాడారని,దేశ ప్రజల్ని ఏకం చేసే జాతీయ గీతాన్ని అవమానించరాదని చెప్పారు.