Sunday 20 April 2014

ఆ వితంతువులు మొత్తానికి ఓటేస్తున్నారు



వృందావన్ లోని వితంతువుల ఆశ్రమాల మీదగతం లో మీరా నాయర్ ఓ సినిమా తీయడం తెలిసినదే.ఉత్తరప్రదేశ్ లో ఉన్న మధుర లోక్ సభ నియోజకవర్గం కిందికి వస్తుందది.భర్తలు చనిపోయిన తర్వాత ఇంట్లో చూసేవాళ్ళు ఎవరూ లేకపోతే అలాంటి వితంతువులు ఇదిగో ఈ ఊరిలోని ఆశ్రమాల్లో చేరుతుంటారు.మొత్తం మీద వీళ్ళు 3000 దాకా ఉన్నా ఓటు మాత్రం ఈసారి 250 మంది మాత్రమే వేస్తున్నట్లు అక్కడి ఒక వితంతువు మనూ ఘోష్ తెలిపారు.గత ఎన్నికల్లో వారి జనాభాలో సగం మంది దాకా ఓటేశారని ఈసారి మాత్రం ఓటర్ల లిస్ట్ లలోనుండి అనేకమందినిమందిని తొలగించారని,చాలా మంది వృద్దులు ఇంకా నిరక్ష్యరాసులు అవడం మూలాన ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. తమకి ఒక సామాజిక గుర్తింపు రావడానికైనా  ఈసారి ఓటేస్తామని చెబుతున్నారు.ఇక్కడ బిజెపి తరుపున హేమా మాలిని,ఆరెల్డి తరపున అజిత్ సింగ్,కాంగ్రెస్ తరపున జయంత్ చౌధరి లోక్ సభకి పోటి చేస్తున్నారు.Click here

No comments:

Post a Comment