Tuesday 9 June 2015

ఢిల్లీ న్యాయ శాఖా మంత్రిని అరెస్ట్ చేసిన పోలీసులు



కేజ్రీవాల్ మంత్రి వర్గం లో న్యాయశాఖా మంత్రి గా ఉన్న జితేందర్ సింగ్ తోమర్ ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి హాస్ ఖాస్ స్టేషన్ కి తరలించారు.ఎన్నికల సమయం లో నకిలీ లా డిగ్రీ సర్టిఫికేట్ల తో నామినేషన్ వేశారని ఆయనపై అభియోగం రావడం తో బీహార్ లోని భగల్ పూర్ యూనివర్శిటి కి ఢిల్లీ పోలీసుల బృందం వెళ్ళి దర్యాప్తు చేయగా అవి నకిలీవని తేలింది.అంతేకాక ఆయన బి.ఎస్సి మార్కుల మెమొ కూడా తేడా ఉన్నట్లు తేలింది.ఆయన చదివినట్లుగా ఉన్న ఫైజా బాద్ కాలేజీ లో అసలాయన జాయిన్ కూడా కాలేదని అవధ్ యూనివర్శిటి అధికారులు తెలిపారు.కాగా కోర్ట్ లో కేసు నడుస్తుండగా ఆయన్ని అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి తోనే జరిగిందని ఆం ఆద్మి పార్టీ ఆరోపిస్తోంది.Click here

No comments:

Post a Comment