Sunday 10 July 2016

మొత్తానికి శవం నిన్న దొరికింది.



ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కి సమీపం లోని మంచేశ్వర్ లోని ఒక స్లం ప్రాంతం లో అశోక్ దాస్, దీప దంపతులు తమ అయిదేళ్ళ పాప తో గత కొన్ని నెలలుగా నివసిస్తున్నారు.ఉన్నట్టుండి అశోక్ మాయమవడం,భార్య కూడ వేరే చోట కి మకాం మార్చడం తో తెలిసిన ఇరుగు పొరుగు పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఇంటి వెనుక వాసన రావడం తో నిన్న శనివారం మేజిస్ట్రేట్ సమక్షం లో తవ్వగా అశోక్ శవం లోపల కనిపించింది.అయితే ఆ శవాన్ని చాలా జాగ్రత్త గా అయిదు పొరలుగా ప్లాస్టిక్ పదార్ధాల్ని పేర్చి దాని కింద కప్పెట్టారు.కియోంజర్ జిల్లా  కి చెందిన ఈ జంట కొంత కాలం కిందట ఇక్కడకి వచ్చారు.అశోక్ (35) డ్రైవర్ గా పని చేస్తున్నాడు.భార్య భర్తలు తరచు తగాదాలు పెట్టుకొనేవారని ఇరుగు పొరుగు తెలిపారు.భార్య దీప కనిపించకుండా పోవడం తో ఆమె తో పాటు ఇంకెవరి హస్తమైనా ఉందా అని పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments:

Post a Comment