Sunday 22 May 2016

సత్యజిత్ రాయ్ స్కెచ్ బుక్ అమ్మకానికి...



భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సత్యజిత్ రాయ్  ది ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పాలి.ఆయన 95 వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని హార్పర్ కోలిన్స్ వాళ్ళు ఒక ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు.అదేమిటంటే 1955 లో ఆయన మొదట దర్శకత్వం వహించిన పధేర్ పాంచాలి సినిమా కోసం ఆ సినిమా తీసే సమయం లో వేసుకున్న స్కెచ్ ల్ని పుస్తంగా  ముద్రించారు.స్క్రీన్ ప్లే కి బదులుగా రాయ్ ఈ విధంగా రాసుకున్నారు.ఈ బొమ్మలు,రాతలు ఉన్న ఈ పుస్తకాన్ని ఒక ఆర్కైవ్ కి డొనేట్ చేశారు.మళ్ళీ ఇన్నేళ్ళకి పాఠకుల కోసం అది అమ్మకానికి వచ్చింది.108 పేజీలు ఉన్న పుస్తకం ఆరువందల రూపాయల పై మాటే.అన్నట్టు పధేర్ పాంచాలి నవలని బిభుభూషణ్ బందోపాధ్యాయ బెంగాలీ లో రాసిన విషయం తెలిసిన విషయమే..!

No comments:

Post a Comment