Sunday 31 July 2016

జైలు లో అంతర్యుద్ధం, ముగ్గురు మృతి



నిన్న శనివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ లోని సాజివ సెంట్రల్ జైలు లో సౌది అరేబియా దేశానికి చెందిన ఇద్దరు ఖైదీలు యూసుఫ్(21),అబ్దుస్(22) లు జైలు లోనే ఉన్న మరో ఖైదీ థాంగ్ మిన్లిన్ జొవ్ ని ఆయుధాల తో పొడిచి చంపారు.దాని తో రెచ్చిపోయిన మిగతా ఖైదీలంతా కలిసి ఈ ఇద్దరు ఖైదీలని కొట్టి చంపారు.ఈ సంఘటన పట్టపగలు ఒంటి గంటకి జరిగింది. మరణించిన యూసుఫ్,అబ్దుస్ ల్ని మైన్మార్ ,మణిపూర్ రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమంగా సంచరిస్తుండడం తో కొద్ది కాలం క్రిందట అరెస్ట్ చేశారు. మూడు మృత దేహాల్ని ఆసుపత్రికి పంపినట్లు మణిపూర్ రాష్ట్ర డిజిపి (ప్రిజన్స్) పి.దౌంజెల్ మీడియా కి వెల్లడించారు. 

No comments:

Post a Comment