Tuesday 8 October 2019

గుడి సముదాన్ని రక్షించమని కోరుతున్న చంబల్ బందిపోట్లు



బందిపోట్లు గా జనాల్ని ఒకనాడు గడ గడ లాడించిన చంబల్ లోయ నివాసులైన మొహర్ సింగ్ గుర్జర్,నిర్భయ్ గుర్జర్ చంబల్ లోయ లో ఉన్న బాటేశ్వర్ దేవాలయ సముదాయాల్ని ప్రభుత్వం ఇకనైనా పట్టించుకుని వాటిని సమ్రక్షించాలని కోరుతున్నారు.వాళ్ళు ఈ మేరకు ప్రధానికి కూడా వినతి పత్రాలు సమర్పించారు.భూతేశ్వర్ అనే మాట బాటేశ్వర్ అయి ఉంటుందని పరిశోధకుల అంచనా.ఇంతకీ గుళ్ళ ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 400 వరకు ఒకే కాంప్లెక్స్ లో ఉంటాయి.రమారమి 25 కి.మీ.ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చిన్న చిన్న గుళ్ళు దాదాపు ఏడు వందల ఏళ్ళ క్రితం గుర్జర-ప్రతిహార రాజులు నిర్మించినవని చరిత్ర.

ఈ సముదాయాన్ని మన దేశపు అంగోర్ వాట్ టెంపుల్ గా పిలుస్తారు.అనేక ఏళ్ళ పాటు అడివి లో ఉండిపోయి అనుకోని విధం గా కనుగొనబడ్డాయి.చాలా ప్రాంతం వరకు కూలగొట్టబడిన గుళ్ళ యొక్క శిధిలాలు పరుచుకుని ఉన్నాయి.ముందు ఇవి కనుగొనబడినప్పుడు ఏవో కొన్ని నిర్మాణాలు ఉండి ఉండవచ్చునని అనుకున్నారు కాని రమారమి 400 గుళ్ళ దాకా ఇప్పుడు లెక్క తేలింది.ఇవి ముస్లిం రాజుల దండయాత్రల్లో ధ్వంసం చేయబడినవా లేదా భూకంపం వచ్చి ఇలా అయినవా అనేది పూర్తిగా నిర్ధారింప బడలేదు.శివుడు,విష్ణువు,పార్వతి,గణేషుడు వంటి దేవతలకి ఇవి అంకితం చేయబడ్డాయి.బందిపోట్లు గా పేరు పొందిన చాలామంది వారి కార్యకలాపాలకి ముందు తమ ఇలవేల్పులైన ఈ దేవుళ్ళ గుళ్ళని దర్శించి పూజించి మరీ వెళ్ళేవారు.









  

No comments:

Post a Comment