ప్రపంచం లో ఇప్పటిదాకా మూడు లక్షల ఎనభై వేల రకాలైన మొక్కల్ని వృక్ష శాస్త్రజ్ఞులు గుర్తించారు.దీంట్లో రెండు లక్షల అరవై వేల మొక్కలు విత్తనాలు ఇస్తాయి. ఏక కణ మొక్కల నుంచి మహా వృక్షాల దాకా ఈ భూమి ఉన్నాయి. మన దేశం లో చెప్పాలంటే 45,000 రకాల మొక్కల్ని గుర్తించారు. రమారమి లక్ష రకాల మొక్కల్ని గుర్తించి వాటి గురించి ఇంకా రాయవలసి ఉంది.
ఎక్కువ గా పూవులు పూచే మొక్కలే ఉన్నాయి. ప్రపంచం లో నాలుగు లక్షల రకాలైన పుష్పించే మొక్కలున్నాయి.వీటి రంగు,సైజు అనేక రకాలుగా ఉంటాయి. బ్రెజిల్ దేశం లో ఈ వృక్ష వైవిధ్యం, జీవ వైవిధ్యం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. వివిధ రకాల మొక్కలు, క్షీరదాలు ,చేపలు 50,000 పై చిలుకు ఉన్నాయి. ఇక మన దేశం కి వస్తే మర్రి చెట్టు ఇంచు మించు అన్ని ప్రదేశాల్లోనూ కనిపిస్తుంది. అందుకే దీన్ని జాతీయ వృక్షం గా ప్రకటించారు.
అడవి విషయానికి వస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానం లో ఉండగా,అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఒరిస్సా ఆ స్థానాల్లో వరుసగా ఉన్నాయి. గుజరాత్ లోని గాంధీ నగర్ లో 32 లక్షల వృక్షాలు ఉన్నాయి.ఇది ఒక రికార్డు. మొత్తం ఇండియా లో 35 బిలియన్ చెట్లు ఉండగా ,భూమి మొత్తం మీద 3 ట్రిలియన్ల చెట్లు ఉన్నట్లు భోగట్టా..!
--- NewsPost Desk
No comments:
Post a Comment