ఖతర్ దేశం ఈ మధ్య బాగా వార్తల్లో వినబడుతోంది. ఇంచుమించు 29 లక్షల జనాభా ఉన్న ఈ దేశం ప్రపంచం లోని ధనిక దేశాల్లో ఒకటి.
ఎంతో ఖ్యాతి చెందిన ఆల్ జాజిర మీడియా నెట్ వర్క్ ఈ దేశం లోని దోహా నుంచి పనిచేస్తుంది. ఆల్ జాజిర అంటే ద్వీప కల్పం అని అర్థం.
నిజానికి ఈ అంతర్జాతీయ న్యూస్ నెట్వర్క్ ఖతర్ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ప్రపంచం లో 350 మిలియన్ కుటుంబాలకి ఇంకా 150 దేశాలకి ఈ వార్తాకదంబం అందుబాటు లో ఉంది.
వెబ్సైట్, యూ ట్యూబ్,టెలివిజన్, రేడియో ఇలాంటివి అన్నీ ఆల్ జాజిర నెట్ వర్క్ లో ఉన్నాయి. కేంద్ర స్థానం దోహా నగరం.
పర్ష్యన్ గల్ఫ్ లో ఉన్న ఈ బుల్లి దేశం లో చమురు,గ్యాస్ నిలవలు ఎక్కువ గా ఉండడం తో అత్యంత ధనిక దేశాల్లో ఒకటి గా మారింది.
1992 లో మాస పత్రిక గా అరబిక్ భాష లో మొదలయి ఇంగ్లీష్ లో తన ప్రసారాల్ని 2006 లో మొదలుపెట్టింది.
ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యం లో భాగం గా ఉన్న ఖతర్, 1971 వరకు బ్రిటిష్ సమ్రక్షణ లో ఉన్నది. 90శాతం వరకు సున్నీ ముస్లింస్ ఉన్న ఈ దేశం లో 3,35,967 మంది హిందువులు కూడా ఉన్నారు.
--- NewsPost Desk
No comments:
Post a Comment