Sunday 18 December 2016

చాలానాళ్ళకి ఒక ఆలోచనలు రేపే పుస్తకం



ఇంగ్లీష్ అవసరం తెలుగు సమాజం లో ఉందా లేదా..ఉన్నట్లయితే ఎంత దాకా ఉంది..? ప్రతి గ్రామం లో ఈ రోజున ఇంగ్లీష్ పాఠశాల వెలుస్తున్నది గాని సరైన ఇంగ్లీష్ పరిజ్ఞానం ఎందుకని నెలకొల్ప లేకపోతున్నది..: ఎక్కడ లోపం ఉంది..? దీనికి తరుణోపాయం ఎక్కడ  ఉన్నది..?ఇప్పటికే ఉన్న అభ్యసన విధానం  లో ఏ మార్పులు అవసరం..?మొత్తం మీద కలిపి ఇరవై ఏళ్ళు విద్యాలయాల్లో గడిపిన సరైన జ్ఞానం..అంటే కనీసం ఓ వ్యాసం రాసే పరిజ్ఞానం లేకుండా ఎందుకు పోతున్నది..? ఇలాంటి విషయాలన్ని ఎలాంటి శష భిషలు లేకుండా  చర్చిన మొట్ట మొదటి పుస్తకం..! అంతే కాదు వివిధ  ఆంగ్ల రచయితల శైలి ని వివరిస్తూ వారి నవలల్ని విశదీకరించిన పుస్తకం ఇది.బహుశా ఇది తెలుగు రచనా రంగం లో ఒక విన్నూత్న తరహా కి చెందిన పుస్తకం అని చెప్పవచ్చు.ప్రతి తెలుగు పాఠకుడు చదవవలసిన పుస్తకం ఈ" మూర్తీస్ మ్యూజింగ్స్"  .

For Copies: Navachetana Book house and Navodaya book house,Hyderabad., Visalandhra book house ,Vijayawada.

Monday 14 November 2016

"బలియాత్ర" పండుగ సంబరాలు ఈ రోజునుంచే ...



ఈ రోజు బలియాత్ర పండుగ సంబరాలు ఒరిస్సా లోని కటక్ పట్టణం లో మహానది తీరాన మొదలవుతున్నాయి. కళింగ ప్రాంతానికి చెందిన జాలరులు తమ నౌకలపై అనేక శతాబ్దాల క్రితం ఇండోనేషియా వద్ద గల దీవులను చేరుకొని విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ పండుగని కొన్ని వందల ఏళ్ళ నుంచి జరుపుతున్నారు.వారం పాటు సాగే ఇక్కడి తిరునాళ్ళ లో ఈ రాష్ట్రం లోని వారే గాక,ఇతర రాష్ట్రాలనుంచి తమ కళాకృతులను తెచ్చి అమ్ముతుంటారు.ఏటా రమారమి 80 నుంచి వంద కోట్ల వ్యాపారం సాగుతుంది.దీనిని పల్లె శ్రీ మేళా అంటారు.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర్నుంచి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి పర్యావరణం నిమిత్తం అనుమతులు తీసుకు రావలసి వచ్చింది.


ఒరిస్సా లోని కేంద్రపడా నుంచి రసాబలి,పూరి నుంచి మాల్ పూవా,ధెంకనాల్ నుంచి బారా,కకేరా,..బారిపడా నుంచి మటం ముధి లు వంటి సంప్రదాయ వంటకాలు నోరు ఊరించనున్నాయి.మొత్తం మీద 1700 స్టాళ్ళు ఏర్పాటు అవుతాయని వార్త. దేశం లోని 28 రాష్ట్రాలనుంచి తమ ఉత్పత్తుల్ని అమ్మడానికి రానున్నారు.ట్రాన్స్ జెండర్స్ కి,అంగవికలాంగులకి సైతం ఈ సారి కొన్ని స్టాళ్ళు రిజర్వ్ చేశారు.



ఒరియా సాన్స్కృతిక వాతావరణానికి ప్రతిబింబం లా సాగే ఈ ఉత్సవాలలో అనేక కళా ప్రదర్శనలు సైతం ఉంటాయి. ఈ  నెల 22 దాక బలియాత్ర ఉత్సవాలు కొనసాగుతాయి. 

Thursday 10 November 2016

ఇండోనేషియా లోని కొన్ని అద్భుత ప్రదేశాలు


ఇండోనేషియా రమారమి 18,000 పై చిలుకు ద్వీపాల తో కూడిఉన్న దేశం.అయితే వాటిల్లో జనాలు ఉండేది కేవలం ఆరు వేల దీవుల్లోనే అని చెప్పాలి.24 కోట్ల జనాభా తో 300 విభిన్న తెగలతో 250 భాషలతో అలరారుతున్న ఆ దేశం లో ఎన్నో చూడదగిన  ప్రదేశాలు ఉన్నాయి.బాలి,సుమత్రా దీవులు పర్యావరణ టూరిజం కి పేరెన్నిక గన్నవి.

ఈ కింద కనిపిస్తున్న ది లేక్ తోబా.వంద కి.మీ పొడవు,30 కి.మీ. వెడల్పు ఉండే చెరువు డబ్భై వేల ఏళ్ళ క్రితం అగ్నిపర్వతం పేలినప్పుడు ఏర్పడినది.నీళ్ళు వెచ్చగా ఉంటాయి.ఇక్కడికి పర్యాటకులు తరచూ వస్తుంటారు.


ఈ కింది చిత్రం బొరోబుడుర్ ,ఒక బోఉధ దేవాలయం. 8 వ లేదా 9 వశతాబ్దం లో శైలేంద్ర అనే రాజు కట్టించినవి.ఇది జావా ద్వీపం లో ఉన్నది.అయితే 14 వ శతాబ్దం లో ఈ నిర్మాణాన్ని గుర్తు దొరకని కారణాల తో అప్పటి పాలకులు వదిలి వేయగా ఒక అరణ్యం మధ్య లో కనుగొని పర్యాటకుల కోసం దీని తెరిచి ఉంచుతున్నారు.

Wednesday 12 October 2016

వియాత్నాం యుద్ధం గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?



క్రి.శ.938 వరకు వియాత్నాం దేశం చైనా యొక్క ఆధీనం లో ఉండేది.రమారమి 1000 ఏళ్ళ పాటు ఇలా ఉన్నది.

ఆ తర్వాత ఫ్రెంచ్ వారి పాలన లోకి వచ్చి 19 వ శతాబ్దం మధ్య వరకు కొనసాగింది. 1954 లో ఫ్రెంచ్ వారు వైదొలగారు.

అమెరికన్ కాంగ్రెస్ దృష్టి లో వియాత్నం వార్ అనేదాన్ని Conflict గానే తప్ప యుద్ధం గా గుర్తించలేదు.

ఆ సమయం లో యుద్ధం లో ఫాల్గొన్న అమెరికన్ సైనికుల్లో మూడింట రెండు వంతులు స్వచ్చందగానే చేరారు.

రెండవ ప్రపంచ యుద్ధం 4 ఏళ్ళు జరిగింది.దాని లో 40 రోజులు Combat days గా గుర్తించారు.అయితే వియాత్నాం యుద్ధం లో 1 ఏడాది లో 240 Combat days గా తేల్చారు.

విజయావకాశాలు సన్నగిల్లడం తో అమెరికా యుద్ధం నుంచి విరమించింది తప్ప ఓటమి తో కాదు.

ఈ యుద్ధం తర్వాత ఇండోనేషియా,థాయ్ లాండ్ ,సింగ పూర్,మలేషియా ల్లో కమ్మ్యూనిజం ప్రభావాన్ని గణనీయం గా తగ్గించగలిగారు.

Friday 30 September 2016

జయలలిత ఆరోగ్యం నిర్ధారిస్తూ ఫోటో విడుదల చేయాలి : కరుణానిధి



గత వారం రోజులు గా అనారోగ్య కారణాల తో అపోలో హాస్పిటల్ లో ఉన్న తమిళ నాడు ముఖ్యమంత్రిణి జయలలిత ఆరోగ్యం ఎలా ఉందో నిజాలు వెల్లడి చేయాలని ,అందుకు గాను ఆమె ప్రస్తుత ఫోటో ని ప్రజల కోసం పత్రికలకి విడుదల చేయాలని డి ఎం కె అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు.ఆమె ని సందర్శించడానికి  వెళ్ళిన మంత్రులు పొన్ రాధాకృష్ణన్ వంటి వారు ఎందుకని ఆ విషయం లో నోరు విప్పడం లేదన్నారు.నిజాలు ప్రజలకి తెలియాలని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే అధికార పక్ష ప్రతినిధి సరస్వతి మాట్లాడుతూ వైద్యుల కోరిక మేరకు ఆమె కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు.

Monday 26 September 2016

భారతీయులపై పరుష పదజాలం వాడిన పాక్ నటుడిని టీవి షో నుంచి తప్పించిన బ్రిటన్ టివి



పాక్ జాతీయుడై ఉండి  ఒక బ్రిటిష్ టీవి సోప్ లో నటిస్తున్న అన్వర్ ని అతను నటిస్తున్న సీరియల్ నుంచి తప్పించారు.కారణం అతను ట్విట్టర్ లో భారతీయుల్ని ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలే." B...s"  అని p...s drinking  c..ts అని ట్విట్టర్ లో దూషించాడు.జమ్మూ కాశ్మీర్ లో మా సోదరీ సోదరుల్ని చంపుతున్న దుర్మార్గులు భారతీయులని,వారి దగ్గర పాక్ కి చెందిన ఆర్టిస్ట్ లు ఎందుకు పనిచేస్తున్నారు..డబ్బులు ఇంకా సంపాయించడానికా..అంటూ పలు వ్యాఖ్యలు చేశాడు.దానితో ప్రస్తుతం నటిస్తున్న కోరోనేషన్ స్ట్రీట్ అనే సీరియల్ నుంచి నిర్వాహకులు తప్పించారు.ఈ అన్వర్ రెండు హాలివుడ్ సినిమాల్లో చిన్న పాత్ర లు పోషించాడు.