Monday 15 April 2019

సైకత శిల్పి ని ఈ రోజు గుర్తు తెచ్చుకోవలసిందే..!



అనేక మార్లు మనకిది అనుభవమే..! మనం పేపర్ తెరవ గానే పూరి బీచ్ లో వేసిన  ఇసుక శిల్పాన్ని చూస్తాము,ఇంకా దానితో బాటుగా చక్కటి సందేశాన్ని కూడా చూస్తాము.దాన్ని చిత్రించిన శిల్పి సుదర్శన్ పట్నాయక్ అనే పేరు ని కూడా చదివి ఉంటాము.ఈరోజు అతని పుట్టిన రోజు.ఎన్నో దేశ విదేశీ సైకత శిల్పాల పోటీల్లో ఫాల్గొని తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న తనకి ఆ కళ ఎన్నో డాక్టరేట్లని,పద్మశ్రీ  అవార్డ్ ని తెచ్చిపెట్టింది.అయితే ఆ పూరీ కుర్రవాని జీవితం ని తెలుసుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి.నిజానికి తను డిగ్రీ కూడా చదవలేదు.చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు.తండ్రి ఇంటినుంచి చిన్న తనం లోనే వెళ్ళిపోఅయడు.అయితేనేం తన సృజనా శక్తి తో తన విధిని తనే లిఖించుకున్నాడు.

చిన్నతనం లో ఒక ఇంట్లో పనిమనిషి గా చేసేవాడు.అక్కడ పిల్లలు వేసే బొమ్మలు చూసి తనలో సహజం గా ఉన్న కళ ని మెరుగులు దిద్దుకునేవాడు.ఖరీదైన పేయింట్స్ కొనే స్థోమత లేక పోవడం వల్ల పూరీ బీచ్ కి వెళ్ళి అక్కడ ఇసుక తో రకరకాల బొమ్మలు వేసేవాడు.అవి చూసిన జనాలు మెచ్చుకునే వారు ,అయితే ఇసుక తో వేస్తే అవి ఎంత కాలం ఉంటాయి,గాలి వచ్చినా అలలు వచ్చినా కొట్టుకుపోతాయి గదా అని నిరాశగా అనేవారు.అయితే తనకి మాత్రం దీనిలో బాగా నమ్మకం ఉండేది.ఒక రాత్రి పడుకున్నప్పుడు అనిపించింది ,అసలు జీవితమే పర్మినెంట్ కాదు అలాగని చచ్చిపోతున్నామా అని అనిపించింది.దీనికి
ఒక కొత్తదనాన్ని జోడించాలి,అప్పుడు ఇంకా బాగుంటుంది అని తోచి బొమ్మ వేసి దానికి కేప్షన్ ని సింపుల్ గా,శక్తిమంతం గా రాసేవాడు.క్రమేపి జనాలు వీటిని ఆదరించారు.ప్రాచుర్యం పొందిన తర్వాత ఫలాన సంఘటన కి ఏ బొమ్మ వేసి ఏ కేప్షన్ పెడతాడు అని లోకం ఎదురు చూడసాగింది.దేశ విదేశాల్లో ఎన్నో బహుమతులు పొందాడు.పత్రికలు దేశ వ్యాప్తం గా పోటీలు పడి తన చిత్రాలు ముద్రిస్తుంటాయి ఈరోజున.నాలో ఉన్న సహజ కళ ని నమ్ముకొని ముందుకి పోయిన నన్ను ఆ కళే పైకి తెచ్చింది.ప్రతి ఒక్కరి లోను ఏదో ఒకటి ఉంటుంది,దాన్ని గుర్తించి జీవితాన్ని అర్పించిన రోజున అది తప్పక మనిషి కి అన్నీ ఇస్తుంది అంటాడు మన సుదర్శన్ పట్నాయక్. 

No comments:

Post a Comment