Thursday 10 March 2016

ఎల్లోరా గుహల్లోని చిత్రాల్ని కొన్ని వందల ఏళ్ళు గా కాపాడుతున్న పదార్థమిదే..!



దాదాపుగా 1500 ఏళ్ళు గా ఎల్లోరా గుహల్లోని వర్ణచిత్రాలు పాడయిపోకుండా కాపాడుతున్న పదార్థాల రహస్యాన్ని ఇటీవల పరిశోధకులు కనుగొన్నారు.దేవగిరి ని పాలించిన యాదవ రాజుల హయాం లో ఈ గుహలు తొలచబడ్డాయి.మట్టి కి,లైం ప్లాస్టర్ లాంటి పదార్ధానికి గంజాయి మొక్కల నుంచి తీసిన రసాయనాన్ని దట్టించి ఆ గుహల్లో పూయడం వల్లనే అవి ఇంతకాలం పాటు పాడవకుండా ఉన్నాయి అని ASI మాజీ ఉన్నతాధికారి రాజ్ దేవ్ అంటున్నారు..ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా తీసిన స్కానింగ్ లో కూడా ఈ సంగతి వెల్లడయింది.ఎల్లోరా గుహల్లో లభ్యమైన నమూనాల్ని ఢిల్లీ ఇంకా జల్నా వద్ద పండే గంజా తో పోల్చినప్పుడు అవి సరిగ్గా సరిపోయినాయని వెల్లడించారు.అయితే అజంతా గుహల్లో ఈ లేపనాన్ని పూయకపోవడం వల్లనే అవి చాలా భాగం దెబ్బతిన్నాయని చెబుతున్నారు.

No comments:

Post a Comment