Thursday 31 March 2016

అతని కోచ్ తోనే ఆ పిల్లవాని గొప్పతనమూ పోయింది.



ఈ సారి జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రం గా ఎంపిక అయిన "దురంతో " ఒడియా చిత్రం దర్శకుడు సౌమేంద్ర పాధి కి కూడా మొదటి సినిమా నే,ఈ సినిమా కధ నిజంగా ఆ రాష్ట్రం లో  జరిగిన దే.2006 లో బుధియా సింగ్ అనే నాలుగేళ్ళ బాలుడు 65కి.మి. దూరాన్ని 7 గంటల్లో పరుగెత్తడం అది  లింకా రికార్డ్ బుక్ లో నమోదు కావడం తెలిసినదే.అతనికి శిక్షణ నిచ్చిన కోచ్ బిరంచి దాస్ కి అనేక బెదిరింపులు వచ్చి ఆ తర్వాత హత్య కి గురవ్వడం జరిగింది.ఆ కోచ్ మరణం తో ఆ పిల్లవాని ప్రగతి కూడ అంతటితో ఆగిపోయింది.ఈ కధనే సౌమేంద్ర తెరకి ఎక్కించాడు.కోచ్ పాత్ర లో హిందీ నటుడు మనోజ్ బాజ్ పాయ్ నటించాడు.అలాగే బుధియా పాత్రని మయూర్ అనే కుర్రాడు పోషించాడు.త్వరలో జాతీయ స్థాయి లో చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించాడు సౌమేంద్ర.!. 

No comments:

Post a Comment